జనావాసాల మధ్య మద్యం దుకాణాలు: నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ.|

0
208

సికింద్రాబాద్ : జనావాస ప్రాంతాలలో మద్యం దుకాణాలను ఏర్పాటు చేయవద్దని డిమాండ్ చేస్తూ బేగంపేట హార్మోని అవెన్యూ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీవాసులు శాంతియుతంగా కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. బేగంపేట గురుమూర్తి కాలనీ సమీపంలో గత నాలుగు సంవత్సరాలుగా మద్యం దుకాణం నడుస్తుండడం మూలంగా కాలనీవాసులు, విద్యార్థులు,మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు. ఇటీవల మద్యం టెండర్లు పూర్తవగా వచ్చే నెల నుండి నూతన దుకాణాలు ప్రారంభం కానున్న తరుణంలో కాలనీ సమీపంలో ఉన్న మద్యం దుకాణాన్ని తరలించాలని డిమాండ్ చేశారు. రాత్రి వేళల్లో మద్యం సేవించిన మత్తులో మందుబాబులు కాలనీకి చెందిన విద్యార్థినిలు,మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు తెలిపారు. కాలనీ లోపలికి రావాలంటే భయాందోళనకు గురికావాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్తే నిర్లక్ష్యాలకు సమాధానాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని మద్యం దుకాణాన్ని వేరొక చోటికి తరలించేంతవరకు పోరాటం సాగిస్తామని పేర్కొన్నారు.

#sidhumaroju   

Search
Categories
Read More
Bharat Aawaz
Are Relationships Losing Value Today?
Are We Losing Our Values in the Name of “Modern Freedom”? — A Painful...
By Reshma Mohammed 2025-12-26 07:06:26 0 546
Andhra Pradesh
వ్యవస్థాపకులుగా విద్యార్థులు ఎదగాలి: ఏపీసీ అనురాధ.
మదనపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం జరిగిన 'ఎంటర్ప్రెన్యూరియల్ మైండ్ సెట్ డెవలప్మెంట్' జిల్లా...
By Pagadala Venkateswar 2026-04-09 04:39:07 0 103
Telangana
జిల్లా కేంద్రం లో నూతన సర్పంచ్ లకు శిక్షణ... కలెక్టర్ రాహుల్ రాజ్.
మెదక్ పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నూతన సర్పంచుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు....
By Gangaram Rangagowni 2026-01-19 10:23:10 0 215
Andhra Pradesh
పుంగనూరు: పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ సమావేశం
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని ఎర్రాతివారిపల్లెలో మంగళవారం వైఎస్సార్ సీపీ రీజనల్...
By Kothuru Murali 2026-02-03 05:25:32 0 133
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com