నార్త్ జోన్ పరిధిలో చోరీ ఐన 111 సెల్ ఫోన్ లు రికవరీ: బాధితులకు అందజేసిన డీసీపీ రష్మీ పెరుమాళ్

0
137

సికింద్రాబాద్ : ఉత్తర మండల పరిధిలో సెల్ ఫోన్లు పోగొట్టుకోవడంతోపాటు చోరీకి గురైన కేసులలో పోలీసులు సిఐఆర్ పోర్టల్ ద్వారా సెల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అందచేశారు. ఉత్తర మండల డీసీపీ రష్మీ పెరుమాళ్ ఫిర్యాదుదారులకు సెల్ ఫోన్లను అందించారు. ఉత్తర మండల పరిధిలోని 11 పోలీస్ స్టేషన్లలో చోరీ అయిన 111 సెల్ ఫోన్లను ఫిర్యాదుదారులకు తిరిగి అందజేసినట్లు వెల్లడించారు. ఇటీవల కాలంలో సెల్ ఫోన్ దొంగతనాలు పెరిగిన నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సిఐఆర్ పోర్టల్ ద్వారా సెల్ఫోన్లను గుర్తించే వెసులుబాటు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుత సమాజంలో సెల్ ఫోన్ల లో అత్యంత కీలకమైన సమాచారం సంక్షిప్తమై ఉంటున్న తరుణంలో ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లను జాగ్రత్తగా పెట్టుకోవాలని సూచించారు. సెల్ ఫోన్ దొంగతనానికి గురైతే ఆందోళన చెందకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సాంకేతిక పరిజ్ఞానంతో సెల్ ఫోన్ కనిపెట్టవచ్చని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ పోర్టల్ గురించి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. 

#Sidhumaroju

 

Search
Categories
Read More
Andhra Pradesh
చాలీచాలని వేతనాలతో విఆర్ఏల ఆవేదన
*చాలీచాలని వేతనాలతో వీఆర్ఏల ఆవేదన*   *వీఆర్ఏల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వాలు*  ...
By Rajini Kumari 2025-12-16 11:44:36 0 112
Andhra Pradesh
శర వేగంగా అభి వృద్ధి చెందుతున్న విశాఖ
బ్రిటిష్ కాలంలో స్వతంత్ర ఉద్యమ మం లో దేశ భక్తులలో ఒకరైన మన ఆంధ్రుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన...
By Mobbu Venkatramana 2026-02-18 14:37:20 0 45
Delhi - NCR
Rijiju Cautions Rahul Gandhi Over 'Anti-National' Remarks in Parliament
Rijiju Cautions Rahul Gandhi Over 'Anti-National' Remarks in Parliament Parliamentary Affairs...
By Bharat Aawaz 2025-07-17 08:26:10 0 1K
Andhra Pradesh
సెయింట్ పీటర్స్ చర్చ్ వారికి మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు శుభాకాంక్షలు
విజయవాడ 25-12-2025   ప్రచురణార్థం   క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి...
By Rajini Kumari 2025-12-25 08:06:20 0 200
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com