ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణ పనుల వల్ల ట్రాపిక్ ఇబ్బందులు కలగకుండా చూడండి : ఎమ్మెల్యే శ్రీ గణేష్

0
99

సికింద్రాబాద్: ప్యారడైజ్ నుంచి బోయిన్ పల్లి వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులను ప్రారంభించడంతో ఈరోజు నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు ట్రాఫిక్ ఆంక్షలను విధించి వాహనాలను దారి మళ్ళిస్తున్నారు . కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గారు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి ట్రాఫిక్ అడిషనల్ డిసిపి వేణుగోపాల్ రెడ్డి, హెచ్ ఎం డి ఏ డిప్యూటీ ఇంజనీర్ విద్యాసాగర్ మరియు ఇతర అధికారులతో మాట్లాడి వాహనదారులకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాన్ని చేపట్టిందని దీనివలన ట్రాఫిక్ ఇబ్బందులకు ప్రజలు గురి కావద్దని కావున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా బాలంరాయి చౌరస్తా,అన్న నగర్ చౌరస్తా లలో తీవ్ర ట్రాఫిక్ జామ్ అవుతుందని, దీని వల్ల స్థానిక బస్తీల వాసులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు.అలాగే వాహనదారులతో కూడా స్వయంగా మాట్లాడి వారి సూచనలను పోలీస్ అధికారుల దృష్టికి తీసుకువచ్చి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

Sidhumaroju

Search
Categories
Read More
Rajasthan
Rajasthan Govt Transfers 222 RAS Officers in Major Shuffle |
The Rajasthan government has carried out a major administrative reshuffle, transferring 222...
By Pooja Patil 2025-09-15 12:16:52 0 483
Andhra Pradesh
క్రిస్మస్ సందర్భంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్
25.12.2025.   క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా, మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ...
By Rajini Kumari 2025-12-25 10:41:49 0 169
Andhra Pradesh
సుపరిపాలిన దినోత్సవంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ గారికి సీఎం చంద్రబాబు స్వాగతం
*Photos :-* సుపరిపాలన దినోత్సవంలో పాల్గొనేందుకు అమరావతి విచ్చేసిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్...
By Rajini Kumari 2025-12-25 07:47:54 0 132
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com