కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ ల పొట్ట కొట్టింది.: ఎమ్మెల్యే తలసాని.|

0
205

సికింద్రాబాద్ :  తెలంగాణ వ్యాప్తంగా ఆటోడ్రైవర్ల జీవనం అగమ్య గోచరంగా మారిందని మాజీ మంత్రి,సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, రానున్న రోజుల్లో లక్ష మంది ఆటో డ్రైవర్లతో ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. బన్సీలాల్ పేట్ జబ్బార్ కాంప్లెక్స్ వద్ద ఆటో డ్రైవర్లతో ముఖా ముఖి అయిన తలసాని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జబ్బార్ కాంప్లెక్స్ నుండి రాణిగుంజ్ వరకు ఆటోను నడిపారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... ఆటో రిక్షా కార్మికులు గత రెండు సంవత్సరాల నుండి పేదరికంలో మగ్గుతున్నారని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ప్రయాణాన్ని ఉచితంగా కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్స్ పొట్ట కొట్టిందని ఆక్షేపించారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12000 ఇస్తామని మోసపూరిత హామీలు ఇచ్చినప్పటికీ ఇప్పటికీ నెరవేర్చింది లేదని అన్నారు. చేతకాని హామీలను ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించి ఓట్లు దండుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లు తలుచుకుంటే ప్రభుత్వాన్ని స్తంభింప చేస్తారని వారి ఉసురు ప్రభుత్వానికి తప్పక తగులుతుందని వెల్లడించారు.

Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు మండలంలో అగ్నిప్రమాదం
పుంగనూరు అగ్నిమాపక కేంద్ర పరిధిలోని చిలకవారి గ్రామంలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది....
By Kothuru Murali 2026-02-12 14:00:35 0 111
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు పట్టణంలో లాటరీ టికెట్లు విక్రయిస్తున్న వ్యక్తులు అరెస్ట్
పుంగనూరు పట్టణంలో నిషేధిత లాటరీ టికెట్లు విక్రయిస్తున్న గోవిందప్ప, మోహన్ బాబులను పోలీసులు శనివారం...
By Kothuru Murali 2026-02-08 10:25:15 0 82
Andhra Pradesh
నారా లోకేష్ బాబును కలిసిన ఐ టి డి పి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి
రాష్ట్ మానవ వనరుల ఐటి ఎలక్ట్రానిక్స్ మరియు ఆర్టీజి శాఖల మంత్రి నారా లోకేష్ బాబును కలిసిన ఐ టి డి...
By Benguluri Madhubabu 2026-03-11 03:37:15 0 120
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com