నూతన బొడ్రాయి ప్రతిష్టాపన, పాల్గొన్న బిఆర్ఎస్ నేతలు |

0
38

సికింద్రాబాద్.. సనత్ నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్ పేట్ హమాలి బస్తీలో నూతనంగా ఏర్పాటు చేసిన బొడ్రాయి ప్రతిష్టాపన 3 వ వార్షికోత్సవానికి బిఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు,సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ లు హాజరయ్యారు. బొడ్రాయి ప్రతిష్టించి మూడేళ్లు గడిచిన నేపథ్యంలో మూడవ వసంతానికి కేటీఆర్ హరీష్ రావు హాజరయ్యారు.బొడ్రాయి పండుగ సందర్భంగా హమాలి బస్తీ వాసులకు శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం రూపంలో శని పట్టిందని, భగవంతుడి ఆశీస్సులతో త్వరగా వదిలిపోవాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. బొడ్రాయి ప్రతిష్టాపన మూడవ సంవత్సరం ఉత్సవాలలో పాల్గొనడం సంతోషంగా ఉందని కెటిఆర్ అన్నారు. పల్లె ప్రాంతాలలో ఘనంగా నిర్వహించే బొడ్రాయి పండుగను పట్టణాలలో సైతం నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.త్వరలో జరగబోయే జూబ్లీహిల్స్ ఎన్నికలలో బి అర్ ఎస్ గెలిపించేలా బంధువులకు స్నేహితులకు చెప్పాలని కేటీఆర్ కోరారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Karnataka
ಕಠ್ಮಂಡುದಲ್ಲಿ ಕೇರಳ ಪ್ರವಾಸಿಗರ ಸಿಲುಕಣೆ: ಅನಾರ್ಕಿ ಪರಿಸ್ಥಿತಿ
ಕಠ್ಮಂಡು ನಗರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಅಶಾಂತಿ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಕರ್ನಾಟಕ ಮತ್ತು ತಮಿಳುನಾಡು ರಾಜ್ಯಗಳಿಂದ ಬಂದ ಭಾರತೀಯ...
By Pooja Patil 2025-09-11 09:46:23 0 65
BMA
✍B.G. Horniman: The Foreign Journalist Who Became India’s Voice
✍B.G. Horniman: The Foreign Journalist Who Became India’s Voice The British Man Who Stood...
By Your Story -Unsung Heroes of INDIA 2025-04-29 12:48:02 0 5K
Andhra Pradesh
నగర హృదయంలో రైవస్‌ కాలువ చరిత్ర చీకటి |
విజయవాడ నగరం మధ్యలో ప్రవహించే రైవస్‌ కాలువకు మామూలు కాలువలా కనిపించినా, దాని వెనక ఆసక్తికర...
By Bhuvaneswari Shanaga 2025-10-15 04:01:40 0 103
Chhattisgarh
CRPF Bus Accident in Balod Leaves 4 Injured |
A CRPF bus carrying personnel overturned late at night in Balod district, Chhattisgarh, leaving...
By Bhuvaneswari Shanaga 2025-09-20 13:39:57 0 249
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com