బస్ చార్జీల పెంపునకు బిఆర్ఎస్ పార్టీ "చలోబస్ భవన్" కు పిలుపు. ముందస్తు జాగ్రత్తగా బిఆర్ఎస్ కార్పొరేటర్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

0
135

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  బస్సు చార్జీలు పెంచినందున నిరసన తెలిపేందుకు  "చలో బస్ భవన్" కు బిఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. పలుచోట్ల బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అల్వాల్ డివిజన్ లోని బిఆర్ఎస్ కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబిత అనిల్ కిషోర్ లతో పాటు మరికొందరు బిఆర్ఎస్ నాయకులను ఈరోజు ఉదయమే శాంతి భద్రతల దృష్ట్యా  అల్వాల్ పోలీసులు తమ అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా శాంతి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... ప్రజల కోసం గళం విప్పిన తమను హౌస్ అరెస్టు చేయకుండా ఇలా పోలీస్ స్టేషన్ కు  తీసుకురావడం సోచనీయమన్నారు. సబిత అనిల్ కిషోర్ మాట్లాడుతూ.. శాంతియుతంగా నిరసన తెలుపుతూ ప్రజాభిప్రాయానికి మద్దతుగా ఉన్న తమను అరెస్ట్ చేయడం బాధాకరమన్నారు.  

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
తప్పులేని పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం: ఎమ్మెల్యే.
మదనపల్లి మండలం తట్టువారిపల్లి సచివాలయం వద్ద మంగళవారం గ్రామ సర్పంచ్ దీపతో కలిసి ఎమ్మెల్యే షాజహాన్...
By Pagadala Venkateswar 2026-02-03 12:36:39 0 31
Telangana
మైనంపల్లి కృషితో అభివృద్ధికి మహర్ధశ :₹4.5 కోట్లతో హై టెన్షన్ రోడ్డుపనులకు శ్రీకారం |
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మచ్చ బొల్లారం డివిజన్ 133 పరిధిలోని హై టెన్షన్ రోడ్డు ప్రాంత ప్రజల...
By Sidhu Maroju 2026-02-08 08:25:14 0 55
Nagaland
Nagaland Launches Traditional Cuisine Campaign to Boost Culinary Tourism
To celebrate its diverse culture, the Nagaland Tourism Department has launched the "Flavours of...
By Bharat Aawaz 2025-07-17 11:10:47 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com