బన్సీలాల్ పేటలోని స్థలం కుర్మ సంఘానిదే : ఎమ్మెల్యే తలసాని

0
277

సికింద్రాబాద్ :   బన్సీలాల్ పేట్ లోని ఆ స్థలం కుర్మ సంఘానికి చెందిన స్మశాన వాటిక స్థలమేనని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. తమ స్మశానవాటిక స్థలంలో అక్రమంగా అనుమతులు తీసుకొని బహులంతస్తుల భవనం నిర్మాణము చేస్తున్నారని కుర్మసంఘం నాయకులు వివిధ రకాలుగా నిరసనలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం వీరికి అండగా మార్వాడీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఆందోళన కారులు సైతం వీరికి అండగా నిలవడం, వారితో కలిసి పెద్దఎత్తున ధర్నా చేశారు. ఈ నేపద్యంలో ఈ రోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ రెవిన్యూ, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ స్థలం కచ్చితంగా కుర్మ సంఘవారికి చెందిన స్మశాన వాటిక అని తెలిపారు. ఈ స్థలం తమ స్వాదినంలోకి తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించినట్లు పేర్కొన్నారు. కోర్టులో వివాదం ముగిసిన వెంటనే స్మశాన వాటికకు కావలసిన సౌకర్యాలన్ని కల్పించి అప్పగిస్తానని వెల్లడించారు. తన పేరును దుర్వినియోగం చేసి అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని కబ్జాదారులను హెచ్చరించారు.

Sidhumaroju

 

Search
Categories
Read More
Andhra Pradesh
పిఠాపురంలో పవన్‌కల్యాణ్‌ పర్యటన.. సంక్రాంతి సంబరాలకు ఏర్పాట్లు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఈ నెల 10వ తేదీన పిఠాపురంలో పర్యటించనున్నారు. అక్కడ...
By Pagadala Venkateswar 2026-01-06 07:43:30 0 186
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా: బురదలో చిక్కుకొని ఇద్దరు చిన్నారులు మృతి.
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం పట్రపల్లి తండాలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది....
By Pagadala Venkateswar 2026-05-13 05:51:37 0 52
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రోజు రోజుకు పెరిగిపోతున్న ఇసుక మాఫియా ఆగడాలు
_*ఎన్టీఆర్ జిల్లా/నందిగామ*_    *_ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామాస్తుల....._*...
By Rajini Kumari 2026-04-01 08:55:53 0 147
Telangana
కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ 'తెలంగాణ ప్రజా వికాస్ సమితి' - పెట్టబోయే పేరు ఇదేనా..?
తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ రానుంది. కల్వకుంట్ల కవిత నేతృత్వంలో ఏర్పాటయ్యే ఈ...
By Ponnala Srinivasrao 2026-04-25 00:53:15 0 78
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com