బన్సీలాల్ పేటలోని స్థలం కుర్మ సంఘానిదే : ఎమ్మెల్యే తలసాని

0
275

సికింద్రాబాద్ :   బన్సీలాల్ పేట్ లోని ఆ స్థలం కుర్మ సంఘానికి చెందిన స్మశాన వాటిక స్థలమేనని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. తమ స్మశానవాటిక స్థలంలో అక్రమంగా అనుమతులు తీసుకొని బహులంతస్తుల భవనం నిర్మాణము చేస్తున్నారని కుర్మసంఘం నాయకులు వివిధ రకాలుగా నిరసనలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం వీరికి అండగా మార్వాడీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఆందోళన కారులు సైతం వీరికి అండగా నిలవడం, వారితో కలిసి పెద్దఎత్తున ధర్నా చేశారు. ఈ నేపద్యంలో ఈ రోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ రెవిన్యూ, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ స్థలం కచ్చితంగా కుర్మ సంఘవారికి చెందిన స్మశాన వాటిక అని తెలిపారు. ఈ స్థలం తమ స్వాదినంలోకి తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించినట్లు పేర్కొన్నారు. కోర్టులో వివాదం ముగిసిన వెంటనే స్మశాన వాటికకు కావలసిన సౌకర్యాలన్ని కల్పించి అప్పగిస్తానని వెల్లడించారు. తన పేరును దుర్వినియోగం చేసి అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని కబ్జాదారులను హెచ్చరించారు.

Sidhumaroju

 

Search
Categories
Read More
Telangana
మత్తు కోరల్లో యువత – భవిష్యత్తు శూన్యం!
అరికట్టేది ఎన్నడూ.......? ప్రగతిశీల యువజన సంఘం కొత్తగూడ, గంగారం మండలాల ప్రధాన కార్యదర్శి -...
By Bittu Bittu 2026-05-07 10:10:17 0 485
Andhra Pradesh
బాయ్స్ హైస్కూల్ లో పర్వీన్ తాజ్ ఫుడ్ చెకింగ్
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని బాయ్స్ హైస్కూల్ లో పార్టీ ఆదేశానుసారం పార్లమెంట్ సెక్రటరీ...
By Kothuru Murali 2026-04-08 11:08:39 0 84
Andhra Pradesh
సాహిత్య అకాడమీ అవార్డుల ప్రకటనను రద్దు చేసింది
*సాహిత్య అకాడమీ అవార్డుల ప్రకటనను రద్దు చేసింది* -శ్రీపర్ణ చక్రవర్తి   న్యూఢిల్లీ: కేంద్ర...
By Rajini Kumari 2025-12-19 11:18:10 0 183
Andhra Pradesh
నో వెహికల్ డే… ఏపీకి కొత్త పరిష్కారమా?
ఆంధ్రప్రదేశ్‌లో ‘నో వెహికల్ డే’ ఆలోచన ఇప్పుడు పెద్ద చర్చగా మారుతోంది....
By Babitha Babitha 2026-05-19 13:10:23 0 52
BMA
BMA
Bharat Media Association
By Bharat Aawaz 2025-06-17 17:54:17 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com