సెంట్రింగ్ బాక్సుల దొంగల అరెస్టు - మీడియా ముందు ప్రవేశపెట్టిన అల్వాల్ పోలీసులు

0
246

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్.    రాత్రి వేళల్లో భవన నిర్మాణాల వద్ద సెంట్రింగ్ సామగ్రిని అపహరిస్తున్న ముఠాను పట్టుకున్నట్లు పేట్ బషీర్ బాద్ ఏసిపి బాలగంగి రెడ్డి తెలిపారు.నిందితుల నుండి 3 లక్షల విలువైన సెంట్రింగ్ సామగ్రి తో పాటు నాలుగు సెల్ ఫోన్లు ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ కేసులో ఒక మైనర్ తో కలిపి 5 మందిని అరెస్టు చేసిన అల్వాల్ పోలీసులు నిందితులను రిమాండ్ కు తరలించారు. జూబ్లీహిల్స్ కు చెందిన గోపాల్ అనే వ్యక్తి జిహెచ్ఎంసి లో చెత్త సేకరించే ఆటో నడుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గోపాల్ కొడుకు సుధీర్ తో పాటు అదే ప్రాంతానికి చెందిన చైతన్య, లక్ష్మణ్, వరుణ్ లు యూసఫ్ గుడా ప్రాంతంలో స్క్రాప్ దొంగతనాలు చేసేవారిని ఎసిపి వెల్లడించారు. ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో ముఠాగా ఏర్పడి భవన నిర్మాణాల వద్ద ఉన్న సెంట్రింగ్ సామాగ్రిని అపహరించేందుకు ప్రణాళిక వేసినట్లు తెలిపారు. అల్వాల్ ప్రాంతంలో జిహెచ్ఎంసి చెత్త తరలించే వాహనాన్ని ఉపయోగించి సెంట్రింగ్ సామాగ్రిని అపహరించారు. దొంగలించిన సొమ్మును ముషీరాబాద్ లో జహీరుద్దీన్ అనే స్క్రాప్ వ్యాపారికి అమ్మినట్లు విచారణలో వెల్లడైంది.జూబ్లీహిల్స్ కు చెందిన చెత్త తరలించే వాహనం అల్వాల్ లో అనుమానాస్పదంగా కనిపించడంతో ఆరా తీయగా సెంట్రింగ్ సామాగ్రి అపహరించే ముఠాగా తేటతెల్లమైంది.  సెంట్రింగ్ సామాగ్రిని అమ్మిన అనంతరం వచ్చిన డబ్బుతో నిందితులు జల్సాలు చేసుకునే వారిని పోలీసులు తెలిపారు.

  SIDHUMAROJU 

Search
Categories
Read More
Andhra Pradesh
Pawan Kalyan: సిక్కు తలపాగా ధరించిన పవన్ కల్యాణ్.
Pawan Kalyan: సిక్కు తలపాగా ధరించిన పవన్ కల్యాణ్.. ఫొటోలు ఇవిగో! 25-01-2026 Sun 19:59 | Andhra...
By Pagadala Venkateswar 2026-01-26 11:25:28 0 101
Andhra Pradesh
శ్రీకాకుళం: 5వ R&B మినిస్టర్ ర్యాంక్
రాష్ట్ర రహదారులు, భవనాల (R&B) శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ నెల 5, 6 తేదీల్లో శ్రీకాకుళం...
By Manda Ramkumar 2026-04-03 05:53:54 0 54
Andhra Pradesh
జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో సత్తా చాటిన పోలీస్ వారసులు
  చీరాల: జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో సత్తా చాటిన చిన్నారులను అభినందించిన జిల్లా...
By Gadiyapudi Narendra 2026-01-27 16:24:52 0 163
Andhra Pradesh
ఉమ్మడి జిల్లాలోని కందుకూరు, మార్కాపురం సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పి శ్రీ ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్, గారు
ఉమ్మడి జిల్లాలోని కందుకూరు, మార్కాపురం సబ్ డివిజన్ పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన...
By Chennaiah Kati 2026-02-04 07:06:45 0 195
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com