మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్

0
190

హైదరాబాద్: సికింద్రాబాద్ లో నూతనంగా నిర్మించిన మెడికవర్ ఆసుపత్రిని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ లు లాంఛనంగా ప్రారంభించారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన చికిత్సను అందిస్తూ మెడికవర్ ఆస్పత్రి పేదలకు సేవలు అందిస్తున్నట్లు ప్రముఖులు తెలిపారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో వైద్యవృత్తి అనేది అత్యంత పవిత్రమైనదని, వైద్యులు అందించే వైద్యంతో వేలాదిమంది ప్రాణాలు కాపాడవచ్చని అన్నారు. బండి సంజయ్ మాట్లాడుతూ ఒక దశలో తనకు హృదయ సమస్యలు తలెత్తినప్పుడు మెడికల్ ఆసుపత్రి వైద్యులే కాపాడారని గుర్తు చేసుకున్నారు.విపత్కర పరిస్థితులలో పునర్జన్మ ఇచ్చేది వైద్యులేనని, రోగులను మానవీయ కోణంలో చికిత్స అందించే వారి భవిష్యత్తును అందించడంలో వైద్యుల పాత్ర కీలకమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఎం.డి. మాట్లాడుతూ ప్రపంచ స్థాయి అత్యాధునిక సదుపాయాలతో అన్ని సేవలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ల్యాబ్ రోబోటిక్, ఆర్థో రోబోటిక్ లాంటి సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన చికిత్సలు కూడా చేయనున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 24వ బ్రాంచ్ కాగా తెలంగాణలో 8వ ఆసుపత్రిని సికింద్రాబాద్ లో నెలకొల్పినట్లు తెలిపారు. 350 పడకలతో పాటు అనుభవజ్ఞులైన వైద్యులచే వైద్య సేవలను అందించనున్నట్లు పేర్కొన్నారు. మెడికల్ ఆసుపత్రి అందించే మెరుగైన వైద్య సేవలను పొందాలని ప్రజలను కోరారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
గుంటూరు జరిగినటువంటి ఒక కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గౌరవనీయులు శ్రీ సాయి కళ్యాణ్ చక్రవర్తి గారి ఆదేశాల మేరకు విద్యార్థులు సైబర్ నేరాల పట్ల తప్పనిసరిగా అవగాహన ఉండాలని ఐదవ అదనపు సివిల్ జడ్జి గౌరవనీయులు శ్రీమతి లతా గారు అన్నారు.
  <>kvsr. కోటేశ్వరరావు. గుంటూరు.   *గుంటూరు, జనవరి 24 : విద్యార్థులు సైబర్...
By KOTESWARARAO KVSR 2026-01-24 13:06:36 0 148
Andhra Pradesh
నిమ్మనపల్లెలో రోడ్డు ప్రమాదం: దంపతులకు గాయాలు.
శుక్రవారం నిమ్మనపల్లె మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొండసానపల్లెకు చెందిన అనూషా (23) మరియు ఆమె...
By Pagadala Venkateswar 2026-02-07 07:10:24 0 36
Andhra Pradesh
పోటాపోటీగా జాతీయ స్థాయి యోగాసనా పోటీలు క్షేత్రస్థాయికి "యోగ" ఫలాలు చేర్చేందుకు ఇండియన్ యోగా ఫెడరేషన్ కృషి..
పోటాపోటీగా జాతీయ స్థాయి యోగాసనా పోటీలు  క్షేత్రస్థాయికి "యోగ" ఫలాలు చేర్చేందుకు ఇండియన్ యోగా...
By Gadiyapudi Narendra 2025-12-28 16:09:02 0 242
Andhra Pradesh
Chandrababu Naidu: ఏపీ క్యాన్సర్ అట్లాస్ విడుదల చేసిన సీఎం చంద్రబాబు.
ప్రాంతాల వారీగా రోగులను గుర్తించి స్థానికంగా చికిత్స అందించడమే లక్ష్యం 2030 నాటికి క్యాన్సర్...
By Pagadala Venkateswar 2026-01-30 05:59:00 0 42
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com