పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

0
149

సికింద్రాబాద్ :   ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మోండా డివిజన్ లో పర్యటించి కోటి 34 లక్షల రూపాయల వ్యయంతో మూడు చోట్ల చేపట్టనున్న CC రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ముందుగా బండిమెట్ లో 39.60 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న CC రోడ్డు, జైన్ టెంపుల్ సమీపంలో 49.50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న CC రోడ్డు, రాజేశ్వరి థియేటర్ వెనుక 45 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న CC రోడ్డు పనులకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శంఖుస్థాపన చేశారు. ముందుగా స్థానికంగా ఉన్న పలువురు వ్యాపారులు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కు శాలువాలు కప్పి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు పలువురు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా విద్యుత్ స్తంభాలపై కుప్పలుగా ఉన్న కేబుల్ వైర్లు, క్రిందకు వేలాడుతున్న వైర్లతో ప్రమాదం పొంచి ఉన్నదని ఎమ్మెల్యే కు విన్నవించారు. స్పందించిన ఆయన వెంటనే కేబుల్స్ తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గతంలో ఈ ప్రాంతంలో పర్యటించి స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రధానంగా మోండా డివిజన్ లోని బండి మెట్ ప్రాంతంలో డ్రైనేజీ, రోడ్లు దెబ్బతిని ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నట్లు గుర్తించడం జరిగిందని చెప్పారు. వారి సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో డ్రైనేజీ, స్ట్రామ్ వాటర్ లైన్ లను నిర్మించడం జరిగిందని, నేడు నూతన రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో కోట్ల రూపాయల వ్యయంతో రోడ్ల నిర్మాణం, అభివృద్ధి, డ్రైనేజీ సమస్యల ను పరిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నో సంవత్సరాల నుండి పరిష్కారానికి నోచుకోని అనేక దీర్ఘకాలిక సమస్యలను బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో పరిష్కారం చూపినట్లు వివరించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. ఈ CC రోడ్ల నిర్మాణం పూర్తయితే 30 సంవత్సరాల వరకు లైఫ్ ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో DC డాకు నాయక్, కార్పొరేటర్ దీపికా, మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, DE మహేష్, వాటర్ వర్క్స్ DGM ఆశిష్, శానిటేషన్ DE వెంకటేష్, ఎలెక్ట్రికల్ AE వరలక్ష్మి, బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు ఆకుల హరికృష్ణ, నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, నాగులు, రాములు, ఓదెల సత్యనారాయణ, జయరాజ్, మహేష్ యాదవ్, మహేందర్, హన్మంతరావు తదితరులు ఉన్నారు.

#sidhumaroju # bharatAawaz #thalasani 

Search
Categories
Read More
Sikkim
Sikkim to Charge ₹50 Entry Fee for Tourists from March 2025
The Sikkim government has introduced a mandatory ₹50 entry fee for tourists from March 2025 (with...
By Bharat Aawaz 2025-07-17 07:27:42 0 906
Telangana
ఈ నెల 31న అగ్ని వీర్ రిక్రూట్మెంట్
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. అగ్ని వీర్ ర్యాలీ పై కీలక అప్డేట్ వచ్చింది. ఈనెల 31 వ తేదీ నుంచి...
By Sidhu Maroju 2025-07-06 11:34:36 0 932
Business
Three Additional Strategic Oil Reserves
The Indian government is considering setting up three additional strategic oil reserves, in...
By Bharat Aawaz 2025-07-03 08:13:47 0 2K
Nagaland
Dimapur Smart City Project Picks Up Pace with Green Initiatives
Under the Smart Cities Mission, Dimapur is witnessing a wave of transformation. The...
By Bharat Aawaz 2025-07-17 11:08:28 0 980
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com