ప్రజా సమస్యల పరిష్కారం కోసమే "కంటోన్మెంట్ వాణి" ఎమ్మెల్యే శ్రీ గణేష్

0
265

సికింద్రాబాద్ :  ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు మెరుగైన సేవలను అందించేందుకు కంటోన్మెంట్ వాణి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. బోయిన్ పల్లి కాంటోన్మెంట్ ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని అన్నారు. కంటోన్మెంట్ లోని ఒకటవ వార్డులో ఏర్పాటుచేసిన కంటోన్మెంట్ వాణి లో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను స్వీకరించిన వివిధ శాఖలకు చెందిన అధికారులు వీలైనంత త్వరగా పరిష్కారం చూసే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ శాసనసభ్యుడు శ్రీ గణేష్, సీఈవో మధుకర్ నాయక్ తో పాటు రెవెన్యూ, పోలీసు, వాటర్ వర్క్స్, ఇంజనీరింగ్, శానిటేషన్, ఆరోగ్యశాఖ అధికారులకు ప్రజలు దరఖాస్తులు అందించారు. ప్రజల నుండి దరఖాస్తులు తీసుకున్న అనంతరం సమస్యలు పరిష్కరించే విధంగా సత్వర చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కంటోన్మెంట్ ప్రజల నుండి వచ్చే విజ్ఞప్తులను దరఖాస్తులను తీసుకుని వాటిని పరిష్కరించే క్రమంలో కంటోన్మెంట్ బోర్డ్ ఎజెండాలో పెట్టనున్నట్లు తెలిపారు. సమస్యలకు అనుగుణంగా నిధులను తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అన్ని శాఖల అధికారులకు ప్రజలు దరఖాస్తులు అందిస్తే వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. 

   Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
క్వాంటం టాక్ బై CM
• ఏపీ నుంచి ఎవరైనా నోబుల్ ప్రైజ్ సాధిస్తే వంద కోట్లు ఇస్తామని గతంలో ప్రకటించాం •...
By Rajini Kumari 2025-12-23 09:45:45 0 145
Andhra Pradesh
జాతీయ స్థాయిలో అన్నమయ్య ఖ్యాతిని చాటిన చిన్నారి శైలేష్ గౌడ్.
మదనపల్లె కలెక్టర్ కార్యాలయంలో, నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించిన చిన్నారి...
By Pagadala Venkateswar 2026-05-12 05:57:32 0 55
Andhra Pradesh
గుంటూరు తూర్పు నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే నసీర్ మెడికల్ కాలేజీ ల పీ పీ పీ పై ప్రజలు ఆలోచించండి
*మెడికల్ కాలేజీల పీపీపీపై ప్రజలు ఆలోచించండి* * సంతకాల పేరుతో సైకోల మాటల నమ్మకండి * జగన్ ను...
By KOTESWARARAO KVSR 2025-12-23 14:11:14 0 193
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com