రైతులను వైకాపా మోసం చేసిందన్న కేంద్ర సహాయ మంత్రి

0
845

ఆచంట, పెనుగొండ: గత ఐదేళ్ల వైకాపా పాలనలో రైతులను పూర్తిగా మోసం చేశారని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఆరోపించారు. పెనుగొండ ఏ.ఎం.సి (అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ) లో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏ.ఎం.సి లకు పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రయత్నిస్తుందని చెప్పారు. ప్రజలు వైఎస్సార్సీపీని కేవలం 11 సీట్లకు పరిమితం చేసినా, ఆ పార్టీ నాయకులు ఇంకా అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. కూటమి నాయకులపై కన్నెత్తి చూస్తే వైఎస్సార్సీపీ కార్యకర్తలకు రోజు గడవడం కష్టం అవుతుందని హెచ్చరించారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని నిస్సహాయ స్థితికి ఆ పార్టీ చేరిందని అన్నారు. ఎన్నికల్లో కష్టపడిన ప్రతి కార్యకర్తకు నామినేటెడ్ పదవులు ఇచ్చి న్యాయం చేస్తామని, ఎవరూ అధైర్యపడొద్దని హామీ ఇచ్చారు. ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడుతూ, భవిష్యత్తులో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో కూటమి జెండాను ఎగరేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో రైతులు 180 ట్రాక్టర్లతో ర్యాలీగా వచ్చి పాల్గొన్నారు. సమావేశం తర్వాత, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ.. పెనుగొండ ఏఎంసీ చైర్మన్‌గా బడేటి బ్రహ్మాజీ, వైస్ చైర్మన్‌లతో పాటు డైరెక్టర్లతో ప్రమాణస్వీకారం చేయించారు

Search
Categories
Read More
SURAKSHA
Pameela Satpathy IAS: A Beacon of Compassionate Governance
A dedicated Telangana IAS officer known for her people-centric administration, effective district...
By Lokeshwari Panthadi 2026-07-15 09:37:16 0 124
Andhra Pradesh
లాజిస్టిక్ హబ్‌గా శ్రీకాకుళం
కనెక్టివిటిని పెంచడం ద్వారా లాజిస్టిక్ హబ్గా శ్రీకాకుళంను మార్చుతున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్...
By Manda Ramkumar 2026-04-13 11:24:09 0 284
Tamilnadu
Tamil Nadu Observes National Electricity Safety Week
The Tamil Nadu Electricity Department is currently observing "National Electricity Safety Week...
By Lokeshwari Panthadi 2026-07-01 04:46:13 0 67
Telangana
మంచిర్యాల్: మున్సిపల్ కౌన్సిలర్ మీటింగ్ బాయ్ కాట్ చేసిన బిజెపి
మంచిర్యాల్ నగరపాలక  సమస్త సర్వసభ్యత్వం సమావేశానికి బిజెపి కార్పొరేటర్లు బహిష్కరించారు....
By Bonagiri RaviShankar 2026-06-29 09:11:19 0 115
Andhra Pradesh
మార్కాపురం పట్టణంలోని పలు ప్రాంతాల్లో సర్ కార్యక్రమం
మార్కాపురం పట్టణంలోని పలు ప్రాంతాల్లో సర్ కార్యక్రమం లో జరుగుతున్న ఎన్యూమ్యారేషన్ డిజిటలైజేషన్...
By Chennaiah Kati 2026-07-05 14:15:15 0 47
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com