రాఖీ పౌర్ణమి సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కి రాఖీ కట్టిన మహిళలు

0
750

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :

 

మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి  క్యాంపు కార్యాలయంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలు  ఎమ్మెల్యే గారికి రాఖీ కట్టి, అక్కాచెల్లెళ్ల బంధాన్ని ప్రతిబింబించే ఈ సాంప్రదాయాన్ని ఎంతో సౌభ్రాతృత్వ భావంతో జరుపుకున్నారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ...అమ్మాయిలు, మహిళలు సమాజ అభివృద్ధికి మూలస్తంభాలు. మహిళల రక్షణ, సంక్షేమం నా మొదటి కర్తవ్యం. ఈ రాఖీ నాకు ఆ బాధ్యతను మరింత గుర్తు చేస్తుంది” అని పేర్కొన్నారు. అదే విధంగా రాఖీ పౌర్ణమి ప్రేమానుబంధాలకు, సహోదరత్వానికి ప్రతీక అని తెలిపారు. దేశవ్యాప్తంగా జరుపుకునే రక్షా బంధన్ పండుగ, ఆడబిడ్డలు తమ అన్నలకు జీవితాంతం అండగా ఉండాలని ఆశిస్తూ కట్టే రక్షాబంధనం భారతీయ జీవన ఔన్నత్యానికి నిదర్శనమని అన్నారు. ప్రజల్లో సహోదరభావాన్ని పెంపొందించే ఈ పండుగను నియోజకవర్గ ప్రజలంతా ఆనందోత్సాహాల్లో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.  ఈ కార్యక్రమంలో గౌతమ్ నగర్ కార్పొరేటర్ మేకల సునీతరాము యాదవ్, బీఆర్‌ఎస్ మహిళా నాయకులు శ్రీదేవి, సూలోచన, సరిత, శారద దేవి,తో పాటు పార్టీ కార్యకర్తలు, మహిళలు అభిమానులు పాల్గొన్నారు.

   - sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
మాకినేని బసవ పున్నయ్య స్టేడియాన్ని ప్రైవేటు వ్యక్తులకు ప్రైవేటు కార్యక్రమాలకు ఇవ్వకూడదని క్రీడాకారుల నిరసన
ప్రచురణార్థం 14/12/25 సింగ్ నగర్    మాకినేని బసవ పున్నయ్య స్టేడియాన్ని ప్రైవేటు...
By Rajini Kumari 2025-12-15 08:04:44 0 186
Telangana
ఇంటర్ పరీక్ష ఫలితాలు.. ఏప్రిల్ మూడో వారానికి వాయిదా!
ఇంటర్ పరీక్ష ఫలితాలు.. ఏప్రిల్ మూడో వారానికి వాయిదా! తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడిలో...
By Pinnehasan Odela 2026-04-08 13:32:29 0 134
Telangana
వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగావాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా
వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం
By Thodupunuri Visweswarrao 2026-01-20 12:53:12 0 335
Andhra Pradesh
గవరమ్మపేట పరిసరాల్లో ఏనుగుల గుంపు సంచారం
గవరమ్మపేట గ్రామ పరిసరాల్లో గురువారం ఉదయం ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు...
By Boiena Rajesh 2026-04-02 05:17:55 0 149
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com