రాఖీ పౌర్ణమి సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కి రాఖీ కట్టిన మహిళలు

0
678

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :

 

మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి  క్యాంపు కార్యాలయంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలు  ఎమ్మెల్యే గారికి రాఖీ కట్టి, అక్కాచెల్లెళ్ల బంధాన్ని ప్రతిబింబించే ఈ సాంప్రదాయాన్ని ఎంతో సౌభ్రాతృత్వ భావంతో జరుపుకున్నారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ...అమ్మాయిలు, మహిళలు సమాజ అభివృద్ధికి మూలస్తంభాలు. మహిళల రక్షణ, సంక్షేమం నా మొదటి కర్తవ్యం. ఈ రాఖీ నాకు ఆ బాధ్యతను మరింత గుర్తు చేస్తుంది” అని పేర్కొన్నారు. అదే విధంగా రాఖీ పౌర్ణమి ప్రేమానుబంధాలకు, సహోదరత్వానికి ప్రతీక అని తెలిపారు. దేశవ్యాప్తంగా జరుపుకునే రక్షా బంధన్ పండుగ, ఆడబిడ్డలు తమ అన్నలకు జీవితాంతం అండగా ఉండాలని ఆశిస్తూ కట్టే రక్షాబంధనం భారతీయ జీవన ఔన్నత్యానికి నిదర్శనమని అన్నారు. ప్రజల్లో సహోదరభావాన్ని పెంపొందించే ఈ పండుగను నియోజకవర్గ ప్రజలంతా ఆనందోత్సాహాల్లో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.  ఈ కార్యక్రమంలో గౌతమ్ నగర్ కార్పొరేటర్ మేకల సునీతరాము యాదవ్, బీఆర్‌ఎస్ మహిళా నాయకులు శ్రీదేవి, సూలోచన, సరిత, శారద దేవి,తో పాటు పార్టీ కార్యకర్తలు, మహిళలు అభిమానులు పాల్గొన్నారు.

   - sidhumaroju 

Search
Categories
Read More
Telangana
ఘనంగా హర్ గర్ తిరంగా జెండా కార్యక్రమం.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: అల్వాల్ సర్కిల్ పరిధి  అంబేద్కర్ నగర్ లో  హర్ గర్ తిరంగా...
By Sidhu Maroju 2025-08-14 10:45:19 0 607
Andhra Pradesh
రొంపిచర్ల :లబ్ధిదారులకు సైకిళ్లను పంపిణీ చేసిన.. చల్లా బాబు
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలంలో గురువారం వెలుగు మరియు డిఆర్డిఏ శాఖ...
By Kothuru Murali 2026-02-05 12:07:56 0 40
Andhra Pradesh
విజయవాడ మున్సిపల్ స్టేడియంలోని టెన్నిస్ విజేతలకు బహుమతులు
*ఖేలో ఇండియా, అస్మిత సాఫ్ట్ టెన్నిస్ లీగ్ (సౌత్ జోన్) విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం.*...
By Rajini Kumari 2026-01-19 11:35:06 0 58
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com