అల్వాల్ డివిజన్ మచ్చ బొల్లారంలో వాటర్ లీకేజ్ : రోడ్లపైకి నీరు గుంతల మయమైన రహదారులు

0
804

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / మచ్చ బొల్లారం.  

 

అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని మచ్చ బొల్లారం ఎంజి నగర్ కాలనీలో గత నాలుగు నెలలుగా కొనసాగుతున్న వాటర్ పైప్ లైన్ లీకేజ్ సమస్య కారణంగా రోడ్లు పూర్తిగా గుంతల మయంగా మారాయి. పలు మార్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (హెచ్ఎం డబ్ల్యూ బ్ల్యూ ఎస్ ఎస్ బి) అధికారులకు ఫిర్యాదు చేసినా, ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో స్థానికుల్లో తీవ్ర అసంతృప్తికి దారి తీసింది.ఈ సమస్యను మహమ్మద్ జావేద్, శోభన్, వెంకట్, దేవేందర్,మహేష్,ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లడంతో తక్షణమే స్పందించి మెట్రోపాలిటన్ వాటర్ సప్లైఅండ్ సీవరేజ్ బోర్డు సంబంధిత అధికారులకు రెండు రోజులలో ఈ పని పూర్తి చేయాలని ఆదేశించారు. 133 డివిజన్ మచ్చ బొల్లారం కార్పొరేటర్ జితేందర్ నాథ్ స్పందిస్తూ...గతంలోనే వాటర్ బోర్డ్ అధికారులకు వినతి పత్రం అందజేసి... ఫోన్ ద్వారా కూడా సమస్యను తెలియజేశారు.మొత్తం మచ్చ బొల్లారం ప్రాంతానికి రోజుకు 14 లక్షల లీటర్ల నీరు సరఫరా అవుతోంది. వాల్ కు రంద్రం ఏర్పడడంతో వాటర్ వాల్ లీకేజ్ వల్ల పెద్ద మొత్తంలో నీరు వృదాగా పోతోంది. దీనివల్ల రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయి.  తీవ్రంగా దెబ్బతిన్న రోడ్డుపై ప్రయాణించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని తెలిపారు. ప్రస్తుతం వీధుల్లో నడవడానికి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో వాహనదారులు వృద్ధులు, మహిళలు, చిన్నారులు జారిపడి పడిపోవడం వంటి ప్రమాదాలు నెలకొన్నాయి. వాహనదారులు ప్రమాదకరంగా రోడ్లపై ప్రయాణిస్తున్నారు. వాటర్ బోర్డ్ అధికారులు తక్షణమే స్పందించి లీకేజ్‌ను సరిచేయాలని డిమాండ్ చేస్తున్నారు . రోడ్ల మరమ్మతులు చేపట్టి భద్రత కల్పించాలి అని తెలిపారు.

   -సిద్దుమారోజు 

Search
Categories
Read More
SURAKSHA
AP పోలీసులు రక్తదానం: ప్రాణాలు కాపాడే సేవ
Description: AP పోలీస్ శాఖ ఈరోజు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రితో కలిసి భారీ రక్తదాన శిబిరం...
By Kalaga Sailaja 2026-07-06 05:50:48 0 68
Andhra Pradesh
ఈరోజు శ్రీ దక్షిణామూర్తి స్వామి వారికి విశేషంగా అభిషేకములు
ఈరోజు రాయచోటి శ్రీ లింగేశ్వర శ్రీ శనీశ్వర స్వామి దేవస్థానం నందు శ్రీ దక్షిణామూర్తి స్వామి వారికి...
By Benguluri Madhubabu 2026-01-15 04:46:24 0 333
Jharkhand
Jharkhand Strengthens Water Conservation and Irrigation
Jharkhand continues to enhance water conservation and irrigation through watershed development,...
By Fathima Safa 2026-07-03 15:26:39 0 31
Andhra Pradesh
చొల్లంగి వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యం
పోలీసుల దర్యాప్తు ప్రారంభం తాళ్లరేవు, తాళ్లరేవు మండలం చొల్లంగి రోడ్డుపక్కన బుధవారం రాత్రి...
By Ratna Sekhar 2026-02-19 18:42:45 0 134
Andhra Pradesh
దిగువ చింత వారి పల్లెలో శుక్రవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టిం
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, దిగువ చింత వారి పల్లెలో శుక్రవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్...
By Kothuru Murali 2026-01-09 12:42:41 0 188
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com