సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో క్రీడా పోటీలను ప్రారంభించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్

0
759

 

 సికింద్రాబాద్/ కంటోన్మెంట్.  

కంటోన్మెంట్ నియోజకవర్గంలోని జింఖానా గ్రౌండ్స్ లో నేడు మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారి సారధ్యంలో నిర్వహిస్తున్న (Maa off season Telangana State Championship-) 2025 క్రీడా పోటీలను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. 30 సంవత్సరాలు పైబడిన పురుషులు మరియు మహిళలకు నిర్వహించే ఈ పోటీలలో పాల్గొనడానికి వచ్చిన క్రీడాకారులను ఆయన అభినందించారు. క్రీడలకు వయసుతో సంబంధం లేదని ఆరోగ్యవంతమైన జీవితానికి క్రీడలు ఆడటం చాలా మంచిదని దీనివల్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరిక ఆరోగ్యం మరియు క్రీడా స్ఫూర్తి పెరుగుతాయని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం పలు క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు ఆయన మెడల్స్ ప్రధానం చేశారు.ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న నిర్వాహకులకు ఆయన అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్ మరియు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

 

-సిద్దుమారోజు

Search
Categories
Read More
Andhra Pradesh
గుడివాడ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ సంపూర్ణ నిషేధం గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
*డిసెంబర్ 1 నుండి గుడివాడలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ ల సంపూర్ణ నిషేధం:గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల...
By Rajini Kumari 2025-12-22 11:24:04 0 185
Andhra Pradesh
అప్రెంటిస్ ఖాళీలు !!
కర్నూలు :  యూఐఐసీఎల్, చెన్నైలో 153 అప్రెంటిస్లుయునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్...
By Hari Krishna 2025-12-24 14:44:23 0 185
Music
Neeti Mohan, Jonita Gandhi, Sukhwinder Singh to Join AR Rahman’s Upcoming Mumbai Concert
Neeti Mohan, Jonita Gandhi, Sukhwinder Singh to Join AR Rahman’s Upcoming Mumbai Concert...
By BMA ADMIN 2025-05-22 17:45:16 0 2K
Andhra Pradesh
పజులుపేట వద్ద ద్విచక్ర వాహనంలో వెళుతున్న ముగ్గురు వ్యక్తులకు కుక్క అడ్డం రావడంతో ప్రమాదం జరిగింది
గురువారం పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలంలోని పజులుపేట వద్ద ద్విచక్ర వాహనంలో వెళుతున్న...
By Kothuru Murali 2026-01-09 12:49:15 0 135
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com