గూడూరు నగర పంచాయతీని అభివృద్ధి అయినా చేయండి లేదా నగర పంచాయతీని రద్దయినా చేయండని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేవీ నారాయణ

0
752

గూడూరులో సిపిఎం ప్రాంతీయ కమిటీ సమావేశం జరిగింది, సమావేశంలో

 సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేవి నారాయణ, మాట్లాడుతూ......

గూడూరు మేజర్ పంచాయతీ నుండి నగర పంచాయతీగా ఏర్పడి 14 సంవత్సరాలు అయిందని, నగర పంచాయతీగా అయ్యిందే గాని ప్రజలపై పన్నుల భారాలే తప్ప అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదని, గూడూరును నగర పంచాయతీ చేయడంతో ఉపాధి హామీ పథకం రద్దయిందని, 

 80 శాతం పేద ప్రజలు ఉన్న గూడూరులో ఉపాధి హామీ పథకం రద్దు కావడంతో వ్యవసాయ పనులు లేని సమయంలో సుదూర ప్రాంతాలకు వలస వెళుతున్నారని, 54 కోట్ల నిధులతో నాలుగు ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మాణం ప్రారంభించి మధ్యలో నిలిచిపోయాయాని,కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయిన కూడా ఆ ట్యాంకుల నిర్మాణం గురించి పట్టించుకోవడంలేదని, డ్రైనేజీ ట్రాఫిక్ సమస్యలతో గూడూరు పట్టణం ఉన్నదని,పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న సామెతగా గూడూరు పట్టణ పరిస్థితి నెలకొన్నదని,సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశామని సుపరిపాలన పేరుతో కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ ప్రచారం చేస్తుందే తప్ప ఇప్పటిదాకా ఎన్ని సిక్స్ లు కొట్టిందో చెప్పాలని, కూటమి ప్రభుత్వానికి గూడూరు పై చిత్తశుద్ధి ఉంటే గూడూరు పట్టణాన్ని అభివృద్ధి చేసి చూపించాలని, లేదా నగర పంచాయతీగా రద్దుచేసి ప్రజలపై పన్నుల భారాలు తగ్గించాలని లేనిపక్షంలో గూడూరు పట్టణంలోని ప్రజలందరినీ ఏకం చేసి నగర పంచాయతీ అభివృద్ధి కొరకు పోరాటాలు కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు,,, కార్యక్రమంలో సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి జే, మోహన్, ప్రాంతీయ కమిటీ సభ్యులు రాజశేఖర్, వెంకటేశ్వర్లు, రవి, కోటేశ్వరయ్య, బెలగల్ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు,

Search
Categories
Read More
Telangana
ఘనంగా ప్రధానమంత్రి జయంతి వేడుకలు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా ఆయన...
By Sidhu Maroju 2025-09-17 15:47:17 0 237
Rajasthan
IMD Southwest Monsoon Withdraws Early in West Rajasthan |
The India Meteorological Department (IMD) has announced the early withdrawal of the southwest...
By Pooja Patil 2025-09-15 12:11:46 0 170
Andhra Pradesh
ఫిల్దర్ఫియా ఏజీ చర్చ్ ను సందర్శించిన ఎంపీ కేశినేని శివనాథ్
*ప్ర‌చుర‌ణార్థం* *29-12-2025*   ఫిల‌దెల్ఫియా ఎ.జి చ‌ర్చ్ ను...
By Rajini Kumari 2025-12-29 09:28:05 0 118
Andhra Pradesh
బర్ధన్ ఆశయాలను కొనసాగిద్దాం... జంగాల అజయ్ కుమార్, కోట మాల్యాద్రి పిలుపు...
జాతీయ పూర్వ ప్రధాన కార్యదర్శి, అమరజీవి కామ్రేడ్ ఏబీ బర్ధన్ 10వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు సిపిఐ నగర...
By John Baji 2026-01-03 02:13:37 0 142
Andhra Pradesh
మదనపల్లెలో రెండు వర్గాల మధ్య ఘర్షణ.
మదనపల్లి రామారావు కాలనీలో సోమవారం పట్టపగలే రెండు వర్గాల యువకులు కర్రలు, రాళ్లతో నడిరోడ్డుపై...
By Pagadala Venkateswar 2026-03-10 04:26:27 0 79
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com