ll తీర ప్రాంత భద్రతకు పటిష్ట చర్యలు . ll

0
2K

శ్రీకాకుళం, జూలై 31: జిల్లాలో తీరప్రాంతాలైన బారువ, కళింగపట్నం, బావనపాడు తదితర తీర ప్రాంతాల భద్రతకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గారు ఆదేశించారు. గురువారం శ్రీకాకుళం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అధ్యక్షతన, జిల్లా ఎస్పీ కె.వి మహేశ్వర రెడ్డి గారు, జెసి ఫర్మాన్ అహ్మద్ ఖాన్ గారు లతో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రధానంగా మత్స్యకారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తగు చర్యలు తీసుకోవాలని, సముద్రంలో పని చేసే ప్రతి మత్స్యకారుడు భద్రతతో కూడిన లైఫ్ జాకెట్ విధిగా ధరించేలా చర్యలు తీసుకోవాలని పలు అంశాలు పైన అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో మెరైన్  ఎ.ఎస్పీ, ఇండియన్ నేవీ స్టాప్ ఆఫీసర్ ఆదిత్య పాండే, డిఆర్ఓ ఎం.వెంకటేశ్వర రావు, శ్రీకాకుళం ఆర్డీవో సాయి ప్రత్యూష,  విపత్తుల నిర్వహణ శాఖ డిపిఎం రాము, మత్స్య శాఖ డిడి సత్యనారాయణ, పోలీస్, వివిధ శాఖల ఆధిపతులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
సైబరాబాద్ 24 ఏళ్ల ప్రస్థానం : సూరారం పీఎస్ లో సంబరాలు .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ 24 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సూరారం...
By Sidhu Maroju 2026-02-12 16:14:02 0 135
Andhra Pradesh
ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి గారు పర్యటించారు!!!!!!!
అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరంలో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి గారు...
By SivaNagendra Annapareddy 2025-12-21 14:46:57 0 160
Technology
మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జర్‌లు తెలుపు, నలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి? అసలు రహస్యం ఇదే!
అన్ని మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జర్‌లు తెలుపు లేదా నలుపు రంగులో ఉంటాయి. ఈ రెండు...
By SivaNagendra Annapareddy 2026-01-05 05:55:37 0 358
Andhra Pradesh
రెవిన్యూ అధికారుల అవినీతి – కలెక్టరేట్ వద్ద బాధితుల ధర్నా.
జరాపల్లి గ్రామంలోని భూమి విషయంలో రెవిన్యూ అధికారుల అవినీతి కారణంగా తాము నష్టపోతున్నామని...
By Pagadala Venkateswar 2026-02-02 07:25:32 0 81
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com