సామాజిక సేవలో డాక్టరేట్ పొందిన నర్ల సురేష్ ను అభినందించి సన్మానించిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.

0
864

మేడ్చల్ మల్కాజ్గిరి /ఆల్వాల్.  

సామాజిక సేవలో తనదైన రీతిలో ముందుకెళుతూ అందరి మన్ననలు పొందుతున్న ఆల్వాల్ కు చెందిన నర్ల సురేష్ ను గౌరవ డాక్టరేట్ వరించింది. ఈమేరకు తమిళనాడులోని హోసూర్ నగరంలో శనివారం ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ, రియల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో నర్ల సురేష్ కు డాక్టరేట్ సర్టిఫికెట్ తో పాటుగా ప్రశంసా పత్రాన్ని నిర్వాహకులు అందజేశారు. వివిధ రంగాలలో ప్రతిభ కనబర్చిన వారితో పాటుగా సామాజికంగా సేవలు చేస్తున్నటువంటి సేవలను గుర్తిస్తూ డాక్టరేట్ ప్రదానం చేయడం జరుగిందని మచ్చబొల్లారం కేంద్రంగా వున్న సురేష్ సేవా సమితి వ్యవస్థాపక నిర్వాహకులు, చైర్మన్ నర్ల సురేష్ తెలిపారు. అల్వాల్ సర్కిల్ ల్లో గత 25 సంవత్సరాలుగా సామాజికంగా, రాజకీయంగా వివిధ రకాల సేవలను అందజేస్తున్నారు. ముఖ్యంగా పేదల అభ్యున్నతికి గాను సురేష్ అనేక సంక్షేమ కార్యక్రమాలను చేస్తున్నారు. ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టేందుకు ఇట్టి ప్రొత్సహకాలు ఎంతగానో ఉపయోగ పడతాయన్నారు. భవిష్యత్తు లో సురేష్ సేవా సమితి మరింత పటిష్టంగా సామాజిక కార్యక్రమాలను రూపొందించుకుంటూ ముందుకెళుతుందని సురేష్ వివరించారు.

   -సిద్దుమారోజు. ✍️

Search
Categories
Read More
Andhra Pradesh
భవాని దీక్షలు విరమణ కార్యక్రమం మొదటి రోజు
నిజం: భవానీ దీక్ష విరమణ మొదటి రోజు కార్యక్రమాలు              ...
By Rajini Kumari 2025-12-12 17:06:49 0 268
Andhra Pradesh
ఎమ్మిగనూరు పట్టణంలోని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం
రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం...
By Boya Dasthagiri 2026-07-13 10:17:03 0 71
Telangana
క్యూఆర్' రిఫ్లెక్టివ్ టేపుల నిబంధనను నిలిపివేయాలి -రాజీవ్ రహదారి పై లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాస్తారోకో -అనంతరం రవాణా శాఖ అధికారులకు వినతిపత్రం అందజేత
రవాణా వాహనాలకు తప్పనిసరి చేసిన క్యూఆర్' రిఫ్లెక్టివ్ టేపుల నిబంధనను ఉపసంహరించుకోవాలని, అలాగే...
By MOHAMMAD MUJEEBUDDIN 2026-03-30 13:32:12 0 461
Andhra Pradesh
చిత్తూరు ఆపరేషన్స్ నాన్ కేడర్ ఎస్పీగా రాజశేఖర్ రాజు బాధ్యతలు స్వీకరణ
చిత్తూరు జిల్లాలో ఆపరేషన్స్ నాన్ కేడర్ ఎస్పీగా శ్రీ ఎస్.ఆర్. రాజశేఖర్ రాజు బాధ్యతలు స్వీకరించారు....
By Kothuru Murali 2026-05-29 13:20:08 0 79
Andhra Pradesh
ఉపాధి వేతనదారులకు రూ.307 అందేలా చూడాలి: డ్వామా పీడీ
ఉపాధి వేతనదారులకు కనీస వేతనం రూ.307 అందేలా చూడాలని డ్వామా పీడీ కె.శారదాదేవి అన్నారు. బొబ్బిలి...
By Boiena Rajesh 2026-03-05 14:08:24 0 316
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com