శ్రీ బాలాజీ రాధాకృష్ణ మఠం భూమి, లీజును రద్దు చేయండి.

0
638

మేడ్చల్ మల్కాజిగిరి  జిల్లా/ అల్వాల్

అల్వాల్ సర్కిల్ భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీమతి కృష్ణవేణి కి కలిసి మచ్చ బొల్లారం డివిజన్ లోబాలాజీ రాధాకృష్ణ మఠం సర్వేనెంబర్ 91 లో ఉన్న ఒక ఎకరం 10 గుంటల భూమి ని ప్రైవేటు చారిటబుల్ ట్రస్ట్ కు లీజును రద్దు కొరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగాా.. అల్వాల్ సర్కిల్ బిజెపి నాయకులు మాట్లాడుతూ.. అల్వాల్ సర్కిల్లోని మచ్చ బొల్లారం డివిజన్లో ఉన్న అతి పురాతనమైన శ్రీ బాలాజీ రాధాకృష్ణ మఠం ఆధీనంలో ఉన్న సర్వేనెంబర్ 91 లో ఉన్న 1 ఎకరం 10 గుంటల భూమిని ప్రైవేటు చారిటబుల్ ట్రస్ట్ కు 11 సంవత్సరాలు నామమాత్రపు నెలవారి అద్దెతో దేవాలయ ఆధీనంలో ఉన్న భూమిని ప్రైవేటు వ్యక్తుల స్వాధీనంలోకి పోతుందని తెలిపారు.  తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం హిందూ దేవాలయాలను, దేవాలయాల ఆస్తులను అన్యక్రాంతం  చేస్తున్నారని తెలిపారు.  శ్రీ బాలాజీ రాధాకృష్ణ మఠంలో ఆధీనంలో ఉన్న ఒక ఎకరం 10 గుంటల భూమిలో నూతనంగా కళ్యాణమండపం  నిర్మించి స్థానిక ప్రజలకు, భక్తులకు అందుబాటులో తేవాలని సూచించారు.  హిందూ భక్తుల ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ ప్రైవేటు వ్యక్తులకు ఇలా లీజును కొనసాగిస్తే దేవాలయ భూములపైన భారతీయ జనతా పార్టీ ప్రజా పోరాటం చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అల్వాల్ సర్కిల్ భారతీయ జనతా పార్టీ మాజీ కౌన్సిలర్  నిమ్మ  కృష్ణారెడ్డి, మచ్చ బొల్లారం అధ్యక్షుడు అజయ్ రెడ్డి, అల్వాల్ డివిజన్ అధ్యక్షుడు కార్తీక్ గౌడ్, వెంకటాపురం డివిజన్ నాయకులు ఆంటోనీ రవి కిరణ్, శ్రీధర్ రెడ్డి, సీనియర్ నాయకులు మాచర్ల శ్రీనివాస్, సంజయ్ కుమార్, తూప్రాన్ లక్ష్మణ్, రాజిరెడ్డి, మహేంద్ర పాల్ సింగ్, అనిల్, సునీల్, కార్తీక్ రెడ్డి, భరత్, రాజు, అజయ్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

  -సిద్దుమారోజు ✍️

Search
Categories
Read More
Telangana
మంత్రి వివేక్ వెంకట స్వామిని కలిసిన మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి.
కుత్బుల్లాపూర్,:పేద వర్గాల పెన్నిధి అయిన కాకా బాటలో నడుస్తున్న వివేక్​కు మంత్రి పదవి రావడంపై...
By Sidhu Maroju 2025-06-13 14:25:20 0 1K
Maharashtra
Bombay High Court: Speed Up Sony–Tata Play Case!
The Bombay High Court has asked the telecom tribunal (TDSAT) to quickly resolve the dispute...
By Bharat Aawaz 2025-06-25 12:54:58 0 1K
Mizoram
Mizoram की पहली रेलवे लाइन: ऐतिहासिक कनेक्टिविटी कदम”
Mizoram ने अपना पहला #RailwayLine Sairang से Aizawl तक चालू करके एक ऐतिहासिक उपलब्धि हासिल करी...
By Pooja Patil 2025-09-12 05:50:20 0 8
Telangana
ప్రశాంతంగా చేప ప్రసాదం పంపిణీ
మృగశిర కార్తెను పురస్కరించుకుని బత్తిని హరినాథ్ కుటుంబం, ఎగ్జిబిషన్ సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో...
By Sidhu Maroju 2025-06-10 10:16:37 0 1K
Karnataka
కర్ణాటక మెట్రో ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వమే ఎక్కువ నిధులు - డిప్యూటీ సీఎం శివకుమార్
నిధుల భారం: బెంగళూరుతో సహా మెట్రో ప్రాజెక్టుల వ్యయంలో 80% నిధులు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వమే...
By Triveni Yarragadda 2025-08-11 06:11:54 0 510
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com