పలు ఆలయాలను సందర్శించుకున్న కార్పొరేటర్ రాజ్ జితేంద్ర నాథ్

0
952

మల్కాజ్గిరి జిల్లా / అల్వాల్

బోనాల పర్వదినాన్ని పురస్కరించుకొని మచ్చబొల్లారం, హరిజన బస్తీ, బోడ్రాయి, అలాగే ప్రముఖ “ఏడు గుళ్ళు" సహా 133 డివిజన్ లోని పలు ఆలయాలను కార్పొరేటర్  రాజ్ జితేంద్రనాథ్  దర్శించుకున్నారు. ఈ సందర్బంగా  అయన అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ప్రజల  ఆరోగ్యం, సుఖసంతోషాలు మరియు శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీల సభ్యులు, కాలనీ సంఘాల ప్రతినిధులు మరియు భక్తులు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ మాట్లాడుతూ... ఇలాంటి పండుగలు మన సంస్కృతి గొప్పదనాన్ని తెలియజేస్తాయి.  మనం కలిసి ఎదుగాలని గుర్తు చేస్తాయి. బోనాల పండుగ సందర్భంగా  అందరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు  తెలియజేస్తున్నాను. అమ్మవారి దీవెనలు మనపై ఉంచి,  మనందరినీ శాంతి, ఐక్యత మరియు అభివృద్ధి మార్గంలో నడిపించాలని అమ్మ వారిని కోరుకున్నట్టు తెలియజేశారు.

-సిద్దుమారోజు 

Search
Categories
Read More
Andhra Pradesh
గతంలో దాడికి గురి అయిన ముత్తిన రామకృష్ణని పరామర్శించిన బి సి వై పార్టీ అధ్యక్షులు రామచంద్రయాదవ్...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో గత నెలలో కొందరు వ్యక్తులు...
By BABJI DADALA 2026-01-27 14:20:22 0 236
Andhra Pradesh
శిక్షణా కానిస్టేబుల్ లకు దిశా నిర్దేశం చేసిన కర్నూలు ఎస్పీ !!
కర్నూలు : కర్నూలు జిల్లా...చట్టాల గురించి తెలుసుకోవాలి ... సాంకేతిక వృత్తి నైపుణ్యాన్ని...
By Hari Krishna 2025-12-31 13:04:18 0 156
Andhra Pradesh
గుంటూరు యువత జాగర్త
గుంటూర్ ఎస్పి గోకుల్ జిందాల్ ఆధ్వర్యంలో జరిగినటువంటి స్పెషల్ డ్రైవ్ లో యువతకు పలు సూచనలు...
By KOTESWARARAO KVSR 2025-12-22 05:44:28 0 192
Telangana
మందమర్రిలో డివైడర్‌ను ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం
మందమర్రిలో డివైడర్‌ను ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం మందమర్రి మండలంలోని బొక్కలగుట్ట సమీపంలో...
By Pinnehasan Odela 2026-01-16 15:03:32 0 257
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com