శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ & ప్రెస్ మీట్

0
1K

ఆనంద్ బాగ్ శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఆలయ అర్చకులు, అభివృద్ధి కమిటీ సభ్యులు శుక్రవారం నిర్వహించిన పత్రికా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.

బ్రహ్మోత్సవాలు: ఆగస్టు 5, 2025 (మంగళవారం) నుండి ఆగస్టు 9, 2025 (శనివారం) వరకు ఐదు రోజుల పాటు జరుగుతాయి. ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎ.బి. రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి.

ప్రధాన కార్యక్రమాలు:

ఆగస్టు 5: కోయిల అల్వార్ తిరుమంజనం, విష్ణు సహస్రనామ పారాయణం, పల్లకి సేవ, అంకురార్పణ.
ఆగస్టు 6: గరుడ హోమం.
ఆగస్టు 7: ఎదుర్కోళ్ళు, స్వామివారి కల్యాణ మహోత్సవం, హనుమత్ సేవ, రథోత్సవం.
ఆగస్టు 8: సుదర్శన హోమం, మహా పూర్ణాహుతి, చక్రస్నానం, వసంతోత్సవం, శ్రీ పుష్పయాగం.
ఆగస్టు 9: ఉత్సవాంత స్నపనం, ఆచార్య ఋత్విక్ సన్మానం.

ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై వెంకట రమణాచార్యులు మాట్లాడుతూ, ఆలయంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆలయ అర్చకులు, క్లార్క్, అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సీనియర్ నేత టిడిపి నుండి బీజేపీలో చేరిన గజేంద్ర గోపాల్
గూడూరు పట్టణానికి చెందిన సీనియర్ టిడిపి నేత, మాజీ పట్టణ అధ్యక్షుడు కడియాల బోయ గజేంద్ర గోపాల్...
By mahaboob basha 2025-08-31 01:00:07 0 354
Gujarat
India Eyes 2030 Commonwealth Games, Ahmedabad in Spotlight
Ahmedabad-Gujarath -India is positioning itself as a strong contender to host the 2030...
By Bharat Aawaz 2025-08-12 13:20:51 0 749
Andhra Pradesh
రైలు వన్ యాప్:: రైల్వే శాఖ
కర్నూలు ;  రైల్ వన్ యాప్రైలు టికెట్‌పై రిబేటు3 శాతం ప్రకటించిన రైల్వే శాఖమార్చి తర్వాత...
By Hari Krishna 2026-01-18 01:01:19 0 66
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com