శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ & ప్రెస్ మీట్

0
1K

ఆనంద్ బాగ్ శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఆలయ అర్చకులు, అభివృద్ధి కమిటీ సభ్యులు శుక్రవారం నిర్వహించిన పత్రికా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.

బ్రహ్మోత్సవాలు: ఆగస్టు 5, 2025 (మంగళవారం) నుండి ఆగస్టు 9, 2025 (శనివారం) వరకు ఐదు రోజుల పాటు జరుగుతాయి. ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎ.బి. రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి.

ప్రధాన కార్యక్రమాలు:

ఆగస్టు 5: కోయిల అల్వార్ తిరుమంజనం, విష్ణు సహస్రనామ పారాయణం, పల్లకి సేవ, అంకురార్పణ.
ఆగస్టు 6: గరుడ హోమం.
ఆగస్టు 7: ఎదుర్కోళ్ళు, స్వామివారి కల్యాణ మహోత్సవం, హనుమత్ సేవ, రథోత్సవం.
ఆగస్టు 8: సుదర్శన హోమం, మహా పూర్ణాహుతి, చక్రస్నానం, వసంతోత్సవం, శ్రీ పుష్పయాగం.
ఆగస్టు 9: ఉత్సవాంత స్నపనం, ఆచార్య ఋత్విక్ సన్మానం.

ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై వెంకట రమణాచార్యులు మాట్లాడుతూ, ఆలయంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆలయ అర్చకులు, క్లార్క్, అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్ : ఎసి బాలూర కళాశాల హాస్టల్ (బి)వార్డెన్ సస్పెండ్
నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని నమ్దేవాడ అ ఏసి కళాశాల  బలూరా హాస్పిటల్ (బీ). వార్డెన్ యo...
By Sadaq Sadaq 2026-02-09 10:15:16 0 85
Andhra Pradesh
మదనపల్లెలో టిప్పర్ ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి.
అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో సోమవారం సీటీఎం రోడ్డు దేవతానగర్ వద్ద గుర్తుతెలియని మహిళను...
By Pagadala Venkateswar 2026-01-26 11:56:11 0 65
Himachal Pradesh
शिमला की खोती रौनक पर हाई कोर्ट की चिंता: पैदल संस्कृति खतरे में
हिमाचल प्रदेश #हाई_कोर्ट ने शिमला नगर की बदलती स्थिति पर गंभीर चिंता जताई है। न्यायालय ने कहा कि...
By Pooja Patil 2025-09-11 11:12:00 0 175
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com