శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ & ప్రెస్ మీట్

0
829

ఆనంద్ బాగ్ శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఆలయ అర్చకులు, అభివృద్ధి కమిటీ సభ్యులు శుక్రవారం నిర్వహించిన పత్రికా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.

బ్రహ్మోత్సవాలు: ఆగస్టు 5, 2025 (మంగళవారం) నుండి ఆగస్టు 9, 2025 (శనివారం) వరకు ఐదు రోజుల పాటు జరుగుతాయి. ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎ.బి. రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి.

ప్రధాన కార్యక్రమాలు:

ఆగస్టు 5: కోయిల అల్వార్ తిరుమంజనం, విష్ణు సహస్రనామ పారాయణం, పల్లకి సేవ, అంకురార్పణ.
ఆగస్టు 6: గరుడ హోమం.
ఆగస్టు 7: ఎదుర్కోళ్ళు, స్వామివారి కల్యాణ మహోత్సవం, హనుమత్ సేవ, రథోత్సవం.
ఆగస్టు 8: సుదర్శన హోమం, మహా పూర్ణాహుతి, చక్రస్నానం, వసంతోత్సవం, శ్రీ పుష్పయాగం.
ఆగస్టు 9: ఉత్సవాంత స్నపనం, ఆచార్య ఋత్విక్ సన్మానం.

ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై వెంకట రమణాచార్యులు మాట్లాడుతూ, ఆలయంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆలయ అర్చకులు, క్లార్క్, అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
మేడ్చల్ జిల్లా కలెక్టరు గా మిక్కిలినేని మను చౌదరి గారు బాధ్యతలు చేపట్టారు
మేడ్చల్ జిల్లా కలెక్టర్ గా మిక్కిలినేని మను చౌదరి గారు నియమితులయ్యారు. ఇంతకుముందు మేడ్చల్...
By Vadla Egonda 2025-06-13 03:00:16 0 2K
Andhra Pradesh
స్వాతి.మే నెల 22. 05,2025 రోజున ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయింది
తెలంగాణ స్టేట్ రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం షాబాద్ గ్రామానికి చెందిన.ఎస్ స్వాతి.మే నెల 22....
By mahaboob basha 2025-07-27 05:32:31 0 770
Business
Delhi-Bound Passengers Alert: Over 32 Trains Affected Due to Scheduled Maintenance Work
Delhi-Bound Passengers Alert: Over 32 Trains Affected Due to Scheduled Maintenance Work New...
By BMA ADMIN 2025-05-20 06:25:45 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com