ఆలయాల చెక్కుల పంపిణీ కార్యక్రమం లో తీవ్ర ఉద్రిక్తత. కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకుల పరస్పర దాడులు

0
1K

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ సర్కిల్ లో ఆషాడ మాస బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం దేవాలయములకు ఆర్థిక సహకార చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలోని అల్వాల్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించారు. చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు అతిథులకు వేదమంత్రాలతో స్వాగతం పలికారు. శాలువాలతో సత్కరించి ఆశీర్వదించారు. ఆ తరువాత జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ విషయం లో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య తీవ్ర ఘర్షణ మొదయింది. వెంటనే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అక్కడినుండి వెళ్ళిపోయాడు. ఈ ఘర్షణలో కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులు ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. వెంటనే పోలీస్ లు ఇరువర్గాలను తమ అదుపులోకి తీసుకొని వారికి రక్షణ కలిగించారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులు ఒకరిపై ఒకరు పిర్యాదులు చేసుకున్నారు. ఉద్రిక్తల వలన ఆగిన చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఆలయ నిర్వాహకులు కొనసాగించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
భారత ఆర్థిక మార్కెట్లపై ఒకరోజు వర్క్‌షాప్. - స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, సెక్యూరిటీస్ మార్కెట్ వంటి రంగాల్లో ఉన్న కెరీర్ అవకాశాలపై విద్యార్థులకు అవగాహన - డాక్టర్ మూర్తి.
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం  బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో భారత ఆర్థిక...
By Ratna Sekhar 2026-03-11 07:11:17 0 111
Andhra Pradesh
సహజ ప్రసవం ద్వారా 4.8 కేజీల శిశువు జననం
సహజ ప్రసవం ద్వారా 4.8 కేజీల శిశువు జననం!   -అనకాపల్లి జిల్లా ఆసుపత్రి వైద్య బృందం ఘనత - 4...
By Rajini Kumari 2025-12-31 09:53:49 0 140
Andhra Pradesh
పుంగనూరు: 'అంబులెన్స్‌కు ఫోన్ చెయ్యలేదు.. ఆ వార్త అవాస్తవం'
పుంగనూరు మండలం మేళందొడ్డి గ్రామానికి చెందిన నారాయణమ్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమె భర్త రామయ్య...
By Kothuru Murali 2026-02-25 09:52:49 0 86
Haryana
Arrested Across Three States for Allegedly Spying for Pakistan
Arrested Across Three States for Allegedly Spying for Pakistan New Delhi, – In the...
By BMA ADMIN 2025-05-22 05:41:33 0 3K
Andhra Pradesh
మదనపల్లి: కరెంటు షాక్‌తో ఎలక్ట్రిషియన్‌కు తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలంలో ఆదివారం, ఎలక్ట్రిషియన్ మహబూబ్ జానీ (38) కొత్తపల్లిలో ఒక ఇంటికి యాంటెన్నా...
By Pagadala Venkateswar 2026-03-01 09:42:22 0 86
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com