వచ్చే ఎన్నికల్లో వచ్చేది మాత్రం వైసీపీ ప్రభుత్వమేనని సయ్యద్ గౌస్ మోహిద్దీన్

0
983

మార్కాపురం టౌన్ నందు బి కన్వెన్షన్ హాల్ నందు వైసిపి విస్తృత స్థాయి సమావేశం విజయవంతంలో ప్రకాశం జిల్లాలో వైసిపి మార్కాపురం నియోజకవర్గం ఇన్చార్జ్ అన్న రాంబాబు మరియు జిల్లా అధ్యక్షులు దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు శివ ప్రసాద్ రెడ్డి, గారి పాత్ర ఎంతో ఉందని వైసిపి నాయకులు సయ్యద్ గౌస్ మోహిద్దీన్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం నాడు జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో అన్నా రాంబాబు కు మరియు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కి శాలువాతో సన్మానించారు. ఈ విస్తృత స్థాయి సమావేశంతో నియోజకవర్గం లో నియోజకవర్గంలో వైసీపీ శ్రేణుల్లో నూతనో త్సాహం నింపారని సయ్యద్ గౌస్ మోహిద్దీన్ కొనియాడారు. నేటికీ జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో గాని మార్కాపురం నియోజకవర్గంలో గాని వైసిపి ఎంతో పటిష్టంగా ఉందంటే దానికి కారణం జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్ రెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్ అన్నా రాంబాబు అని ఆయన పేర్కొన్నారు. అన్న రాంబాబు నాయకత్వంలో ఎన్నికలకు వైసీపీ మరింత పటిష్టమవుతుందన్నారు. నియోజకవర్గంలో వైసిపి చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఘనత అన్నా రాంబాబు గారి దేనని ఆయన పేర్కొన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు, రాజకీయాలు చేసినా వచ్చే ఎన్నికల్లో వచ్చేది మాత్రం వైసీపీ ప్రభుత్వమేనని సయ్యద్ గౌస్ మోహిద్దీన్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి ప్రకాశం జిల్లా చైర్మన్ బూచేపల్లి శివ రెడ్డి, మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ రాంబాబు , ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ పరిశీలకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి మార్కాపురం మాజీ శాసనసభ్యులు జంకె వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

Search
Categories
Read More
Goa
दिवर बेटावरील साप्तकोतेश्वर मंदिर स्थळी “कोटी-तीर्थ मार्ग” योजना
गोआ सरकारेन दिवर बेटावरील #साप्तकोतेश्वर_मंदिर जागेवर नवीन मंदिर आणि स्मारक उभारपाचो निर्णय घेतलो...
By Pooja Patil 2025-09-11 10:56:59 0 66
Andhra Pradesh
ఉద్యోగాలు, పెట్టుబడులకు బలమైన నాడు పాలసీ |
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ₹7,500 కోట్ల సబ్సిడీ బకాయిలను...
By Bhuvaneswari Shanaga 2025-10-01 09:54:25 0 78
Sports
బుమ్రా తర్వాత సిరాజ్‌నే.. టెస్ట్‌లో భారత గర్వం |
భారత టెస్ట్ బౌలింగ్ విభాగంలో మరో గర్వకారణం చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన మియాన్‌...
By Bhuvaneswari Shanaga 2025-10-09 07:43:39 0 32
Telangana
జీవో 9 విచారణతో స్థానిక ఎన్నికల భవితవ్యం |
బీసీ రిజర్వేషన్ల అంశంపై ఉత్కంఠ నెలకొంది. అక్టోబర్ 08న హైకోర్టులో జీవో 9పై విచారణ జరగనుంది....
By Bhuvaneswari Shanaga 2025-10-08 05:27:37 0 30
Andhra Pradesh
కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కామెంట్స్
దేవాలయం భూములను కొల్లగొట్టేందుకు కూటమి ప్రభుత్వం చీకటి జీవోను తీసుకోస్తున్నారు దీనిని వైఎస్ఆర్...
By mahaboob basha 2025-05-30 15:24:50 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com