ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల నేపథ్యంలో భారీ బందోబస్తు : నార్త్ జోన్ డిసిపి రష్మీ పెరుమాళ్

0
1K

సికింద్రాబాద్.. ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల నేపథ్యంలో శాంతిభద్రత దృష్ట్యా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర మండల డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. అమ్మవారి బోనాల జాతర జయప్రదం చేసేందుకు వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించినట్లు వెల్లడించారు. పోలీసు శాఖ తరపున 2000 మంది సిబ్బంది బోనాలు, రంగం కార్యక్రమంలో బందోబస్తు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భక్తులకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు, బోనాలతో వచ్చే మహిళలకు మొత్తం ఆరు క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు అందులో బోనాల కోసం ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బోనాల ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత తో పాటు నూతనంగా 40 సీసీ కెమెరాలు కూడా పెంచినట్లు వెల్లడించారు.ఈ ఏడాది కూడా డీజేలకు అనుమతి లేదని, ఫలహరం బండ్లు ఊరేగించేవారు తమను సంప్రదిస్తే వారికి బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. భక్తుల వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ వసతి కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. జూలై 13, 14వ తేదీలలో జరిగే బోనాల ఉత్సవాలకు ప్రజలు రావాలని ఆహ్వానించారు. బోనాలతో వచ్చే మహిళలను పిల్లలను కుటుంబ సభ్యులను బొనాల క్యూ లైన్ లో అనుమతి ఇస్తామని తెలిపారు. బోనాల రోజు బాటా కూడలి నుండి మధ్యాహ్నం ఒంటిగంట నుండి మూడు గంటల వరకు శివసత్తులు, జోగిని లకు ప్రత్యేక దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు.

 

 

Search
Categories
Read More
Andhra Pradesh
కూడల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు : కమిషనర్
కర్నూలు :  కర్నూలు సిటీ :  కూడళ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు ➡️ నగరపాలక సంస్థ...
By Hari Krishna 2026-02-03 12:16:03 0 346
Andhra Pradesh
విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న ఎమ్మెల్యే కొండయ్య
నేడు చీరాలలో ఎన్ఆర్పిఎం హై స్కూల్ సందర్శించిన సందర్భంగా విద్యార్థులతో కలిసి చీరాల శాసనసభ్యులు...
By Vadlamudi NagaVenkat 2026-03-17 06:12:42 0 603
Andhra Pradesh
Arava Sridhar: ‘రాజకీయం చేయొద్దు.. పవన్ పేరు చెడగొట్టొద్దు’: అరవ శ్రీధర్ కేసులో మరో వీడియో విడుదల చేసిన మహిళా ఉద్యోగి.
తన సెల్‌ఫోన్‌తో పాటు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సెల్‌ఫోన్‌ను పరిశీలిస్తే వాస్తవాలు...
By Pagadala Venkateswar 2026-02-03 06:43:26 0 112
Andhra Pradesh
డిల్లీ లో జవహర్ లాల్ నెహ్రూ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన రెండవ షూటింగ్ బాల్ ప్రపంచ కప్ పోటీలలోబంగారు పతకం సాధించిన పి. అనురాధ రెడ్డి
చీరాల: డిల్లీ లో 01/02/2026 నుండి 03/02/2026 వరకు జవహర్ లాల్ నెహ్రూ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన...
By Gadiyapudi Narendra 2026-02-05 13:42:52 0 155
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com