భువనేశ్వర్ నుంచి అక్రమంగా హైదరాబాద్ కు గంజాయి రవాణ. ఇద్దరు నిందితుల పట్టివేత. వారి నుండి 34 కేజీల గంజాయి స్వాధీనం.

0
1K

17 లక్షల విలువ చేసే 34 కిలోల గంజాయిని సికింద్రాబాద్‌ డిటిఎఫ్ ఎక్సైజ్‌ సిబ్బంది పట్టుకున్నారు. హైదరాబాద్‌ లో ఒక వ్యక్తికి గంజాయిని ఇవ్వడానికి బీహార్‌కు చెందిన ఏ. రమేష్‌ కుమార్‌, ఏ చందన్‌ కుమార్‌ ఇద్దరు కలిసి మూడు బాగుల్లో 17 గంజాయి ప్యాకెట్లను తీసుకొని భువనేశ్వర్‌ రైళ్లో వచ్చి సికింద్రాబాద్‌ జేబీఎస్‌లో గంజాయి ప్యాకెట్లతో ఎదురు చూస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న సికింద్రాబాద్‌ డీటీఎప్‌ సీఐ సావిత్రి సౌజన్యతో పాటు సిబ్బంది కలిసి, నిందితులను...గంజాయిని పట్టుకున్నారు. భువనేశ్వర్‌ నుంచి తీసుక వచ్చిన ఈ గంజాయిని డిటిఎఫ్ సిబ్బంది పట్టుకున్నారని సికింద్రాబాద్‌ ఏఈఎస్‌ శ్రీనివాస్‌రావు తెలిపారు. హైదరాబాద్‌లో ఈ గంజాయిని ఎవరికి  ఇవ్వడానికి తీసుక వచ్చారనే విషయంపై ఆరా తీస్తున్నామని తెలిపారు. నిందితులను.. గంజాయిని సికింద్రాబాద్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ అప్పగించారు. గంజాయిని పట్టుకున్న టీమ్‌లో సీఐతోపాటు సత్యనారాయణ, ఖలీల్‌, రవి,శిల్పా, పరమేష్‌లు ఉన్నారు. గంజాయిని పట్టుకున్న టీమ్‌ను ఎన్‌ఫొర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసీం తో పాటు హైదరాబాద్‌ ఇంచార్జీ డీసీ. అనిల్‌కుమార్‌రెడ్డిలు అభినందించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులను పరిశీలించిన బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్
సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులను పరిశీలించిన బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ బాపట్ల: ప్రముఖ...
By Gadiyapudi Narendra 2026-01-03 16:23:53 0 150
Andhra Pradesh
ఇప్పటంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫిర్యాదు సమర్పణ
*ఇప్పటంలో ఇటీవల నాగేశ్వరమ్మ గారిని కలిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్...
By Rajini Kumari 2025-12-28 10:05:59 0 76
Andhra Pradesh
పీకలవాగును పరిశీలించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో ప్రవహించే కీలకమైన పీకలవాగు ప్రాంతాన్ని ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా...
By John Baji 2026-02-04 11:46:09 0 70
Sports
India’s First-Ever International Javelin Event
The Neeraj Chopra Classic 2025 matters a lot not just as a sports event, but as a powerful symbol...
By Bharat Aawaz 2025-07-04 05:16:26 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com