నేతన్నలకు భారీ గుడ్ న్యూస్ చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం

0
1K

*నేతన్నలకు సర్కార్ భారీ గుడ్ న్యూస్* తెలంగాణ ప్రభుత్వం నేతన్నలకు భారీ గుడ్ న్యూస్ తెలిపింది. చేనేత కార్మికులకు సంబంధించిన రూ.33 కోట్ల చేనేత రుణాలను మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు మరియు వాణిజ్య (టెక్స్టైల్) శాఖ 2025-26 బడ్జెట్‌లో భాగంగా చేనేత కార్మికులకు ఋణమాఫీ చేసేందుకు రూ.33 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతి ఇచ్చింది. ఈ నిధులు"చేనేత కార్మికులకు రుణమాఫీ పథకం" కింద విడుదల చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు హ్యాండ్లూమ్స్ మరియు అప్పారెల్ ఎక్స్‌పోర్ట్ పార్క్స్ కమిషనర్‌కు ఆర్థికశాఖ ఆదేశాలు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఋణమాఫీలు చేసినందుకు నేతన్నలు, చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Search
Categories
Read More
Manipur
মণিপুরে একদিনের উপবাস ও প্রার্থনা শান্তি ও ন্যায়ের আহ্বান
১৩ সেপ্টেম্বর, #মণিপুরে একদিনের #উপবাস এবং প্রার্থনার আয়োজন করা হয়েছে। এই অনুষ্ঠানে...
By Pooja Patil 2025-09-13 06:36:00 0 80
Telangana
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరిపించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
*ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం..మర్రి రాజశేఖర్ రెడ్డి* తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా...
By Vadla Egonda 2025-06-02 12:00:17 0 2K
Assam
Title: Assam Cabinet Clears SOP on Illegal Migrants Expulsion
The Assam Cabinet has approved a Standard Operating Procedure (#SOP) under the Immigrants Act...
By Pooja Patil 2025-09-11 05:58:27 0 336
Telangana
గంజాయి చాక్లెట్లను పట్టుకున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్.
సికింద్రాబాద్:  సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పోలీసులు...
By Sidhu Maroju 2025-10-14 15:21:22 0 99
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com