నాపై చేస్తున్న ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజకీయాలనుండి తప్పుకుంటా: ఎంపీ. ఈటెల

0
1K

సికింద్రాబాద్..కాళేశ్వరం కమిషన్ విషయంలో తనపై బురద చల్లడం సరికాదని,తనపై వచ్చిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.కాళేశ్వరం లో అవినీతి జరిగిందనే అంశంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, అప్పటి మంత్రివర్గ ఉప సంఘం లో తనతో పాటు మరో ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారని వారికి అన్ని వాస్తవాలు తెలుసని అన్నారు.బనకచర్ల పై ఆనాడే తాను మాట్లాడానని ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ లో కొట్లాడిందే తానని తెలిపారు.కాలేశ్వరం కమిషన్ విచారణ త్వరగా పూర్తి చేస్తారన్న నమ్మకం తమకు లేదని,రిపోర్ట్ ఇస్తారనేది కూడా లేదన్నారు.వెంటనే సిబిఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. దమ్ముంటే విచారణ ముగిసిన అనంతరం వచ్చే రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో భాజాపా కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకం కాదని, అవినీతి జరిగితే కూడా ఉపేక్షించేది లేదని అన్నారు. కాలేశ్వరం కేసీఆర్ నిర్మించింది కాదని జల యజ్ఞంలో భాగంగా ప్రాణహిత చేవెళ్లను రీడిజైన్ చేశారని అందులో 3 బ్యారేజీలు మాత్రమే కొత్తగా నిర్మించాలని వెల్లడించారు. ఈనెల 22 న 11 సంవత్సరాల భాజాప పాలనపై ఛాయాచిత్ర ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ హాజరుకానున్నట్లు తెలిపారు. 

 

 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: ప్రతి విద్యార్థి కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలి
విజయ కుమారి, శివ రత్నమ్మ గురువారం కలమందలవారిపల్లి ఎంపీపీ పాఠశాలలో వార్షికోత్సవానికి హాజరయ్యారు....
By Kothuru Murali 2026-04-22 14:38:03 0 58
Telangana
ఏడుగురు పేకాట రాయుల అరెస్ట్
భరత్ అవాజ్  ప్రతినిధి: హన్మకొండ సుబేధారి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్నారనే సమాచారం...
By Prashanth Goindla 2026-02-09 07:19:41 0 300
Telangana
లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల అందజేత.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పలువురు పేదలు గత కొన్ని రోజులుగా...
By Sidhu Maroju 2025-11-28 16:20:20 0 170
Tamilnadu
మహబూబాబాద్ జిల్లాలలో 25 మంది ఎస్సైలు బదిలీ
  న్యూస్ (భారత్ ఆవాజ్ ) జిల్లాలో 25 మంది ఎస్సైలు బదిలీ అయ్యారు. మహబూబాబాద్ సీసీఎస్కు...
By Midathapalli Kiran Kumar 2026-04-27 03:33:09 0 155
Andhra Pradesh
అడవిలో చావు బతుకు మధ్య దొరికిన "అపరంజి" ఉపిరి పోసిన చింతూరు వైద్యులు!"
కన్నప్రేమ కరువైందో.. లేక ఆడపిల్ల అనే అనాగరికపు ఆలోచనో తెలీదు కానీ, పురిట్లోనే ఆ పసికందును అడవి...
By Shyamala Yadagiri 2026-05-16 11:42:01 0 57
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com