జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి.

0
28

మంచిర్యాల జిల్లా : రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నేరాల నియంత్రణలో భాగంగా టాస్క్ ఫోర్స్/నార్కోటిక్ బృందం చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో భాగంగా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టేకుమట్ల గ్రామంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై దాడి నిర్వహించారు. నమ్మదగిన సమాచారం మేరకు టేకుమట్ల గ్రామంలో కొందరు వ్యక్తులు నగదును పందెంగా పెట్టుకుని మూడు ముక్కల పేకాట ఆడుతున్నట్లు తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 52 పేకముక్కలు, రూ.21,450 నగదు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం పట్టుబడిన నిందితులను, స్వాధీనం చేసుకున్న నగదు మరియు ఇతర వస్తువులతో పాటు జైపూర్ పోలీస్ స్టేషన్ అధికారులకు అప్పగించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది!
పండుగల నేపథ్యంలో షెడ్యూల్‌లో మార్పు చేసిన విద్యాశాఖ మార్చి 20కి బదులుగా 21న ఇంగ్లీషు పరీక్ష...
By Pagadala Venkateswar 2026-02-07 11:24:17 0 182
Andhra Pradesh
పుంగనూరులో నుజ్జు నజ్జు అయిన ద్విచక్ర వాహనం
శుక్రవారం రాత్రి పుంగనూరు పట్టణంలో పుంగమ్మ చెరువు కట్టపై పుంగనూరు నుంచి బైరెడ్డిపల్లికి వెళ్తున్న...
By Kothuru Murali 2026-01-17 12:44:22 0 159
Andhra Pradesh
Pawan Kalyan: ప్రతిదానికీ నేనే స్పందిస్తుంటే మీరెందుకు ఉన్నట్టు?: జనసేన నేతలపై పవన్ కల్యాణ్ అసంతృప్తి!
అన్నింటికీ నేనే మాట్లాడాలా అంటూ నేతలపై పవన్ ఆగ్రహం   తిరుపతి లడ్డూ కల్తీపై వైసీపీ...
By Pagadala Venkateswar 2026-02-03 07:08:41 0 152
Telangana
నిజామాబాద్: మే 1 నుoడి నిబంధ అమలు సిపి సాయి చైతన్య
నిజామాబాద్ జిల్లా ప్రజలు ఈ క్రింది నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని  నిజామాబాద్ CP పి. సాయి...
By Sadaq Sadaq 2026-05-01 07:07:57 0 139
Andhra Pradesh
పుంగనూరు:అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పులి నరేంద్రకు ఘన సన్మానం
అన్నమయ్య జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పులి నరేంద్ర కుమార్ రెడ్డి నియమితులైన సందర్భంగా,...
By Kothuru Murali 2026-05-17 16:49:19 0 73
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com