విద్యార్థుల డిజిటల్ విద్యకు స్మార్ట్ టీవీ బహూకరణ

0
64

మహబూబాబాద్,
మహబూబాబాద్ మండలంలోని ఎంపీపీఎస్ హనుమంతునిగూడెం పాఠశాల విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం కీర్తిశేషులు బండి ఎలేంద్ర, బిక్షపతి కుమారుడు బండి శ్రీనివాస్ తన తల్లిదండ్రుల స్మారకార్థం రూ.25 వేల విలువైన స్మార్ట్ టీవీని పాఠశాలకు బహూకరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలాజీ కుమార్ మాట్లాడుతూ, డిజిటల్ యుగంలో విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన బోధన అత్యంత అవసరమని అన్నారు. పేద, వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు నాణ్యమైన డిజిటల్ విద్యను అందుకునేందుకు ఈ స్మార్ట్ టీవీ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

విద్య పట్ల సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి పాఠశాలకు స్మార్ట్ టీవీని అందించిన శ్రీ బండి శ్రీనివాస్ సేవాభావం, దాతృత్వాన్ని ఆయన కొనియాడారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కిరణ్ కుమార్, శంకర్, సాయికుమార్, శిరీష పాల్గొని దాతకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం సమాజంలోని దాతలు ఇలాంటి సేవా కార్యక్రమాలకు మరింతగా ముందుకు రావాలని ఆకాంక్షించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఎస్సీ మొర్చా ఆధ్వర్యం లో మహిళా దినోత్సవం
ఎస్సీ మోర్చ ఆధ్వర్యం లో మహిళా దినోత్సవం ఘనంగా  జరిగింది వివరాలకు వెళ్లితే విశాఖ బీచ్ రోడ్...
By Mobbu Venkatramana 2026-03-12 14:15:04 0 346
Business & Finance
Wind Up an LLP with a Simple Legal Exit Process
Winding up an LLP (Limited Liability Partnership) is the legal process of closing the business...
By Navya Sree 2026-07-10 05:35:48 0 57
Andhra Pradesh
పుంగనూరు: మహా కుంభాభిషేకంలో పాల్గొన్న పెద్దిరెడ్డి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, ఆరడిగుంట, చిన్నకొండ చారాలలో ఆదివారం శ్రీ పటాలమ్మ మహా కుంభాభిషేకం...
By Kothuru Murali 2026-05-03 16:41:40 0 93
Telangana
ఆన్లైన్ మందుల అమ్మకాల పై నిరసన, 20 న మెడికల్ షాపుల బంధుకు పిలుపు
ఆన్లైన్లో మందుల అమ్మకాలను వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్...
By Vangari Praveen 2026-05-18 08:25:06 0 539
Andhra Pradesh
తిరుపతి లో ఉద్యోగాలు !!
కర్నూలు :  ** ఆంధ్రప్రదేశ్ తిరుపతి లో నాన్ టీచింగ్ కొలువులు !!ఇండియన్ ఇన్‌స్టిట్యూట్...
By Hari Krishna 2025-12-22 08:26:07 0 223
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com