నీట్ వివాదంపై ఆల్వాల్‌లో కాంగ్రెస్ ఆందోళన.!

0
24

● ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేసిన కాంగ్రెస్ నేతలు

● విద్యార్థులపై లాఠీచార్జిని ఖండించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి

● దిష్టిబొమ్మ దహనయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్, జూలై 22: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనతో పాటు నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిని ఖండిస్తూ కాంగ్రెస్ నాయకులు బుధవారం ఓల్డ్ ఆల్వాల్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ, నీట్ వ్యవహారంలో నష్టపోయిన విద్యార్థులకు పూర్తి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మల్కాజిగిరి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి తోట లక్ష్మీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రశ్నపత్రం లీకేజీపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు. నిరసన తెలిపిన విద్యార్థులపై బలప్రయోగం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

#sidhumaroju

Search
Categories
Read More
Telangana
నేడే పదవ తరగతి ఫలితాలు
న్యూస్ (భారత్ ఆవాజ్ ) నేడే పదవ తరగతి ఫలితాలు మధ్యానం 2 గంటలకు విడుదల ప్రకటించిన బోర్డు 
By Midathapalli Kiran Kumar 2026-04-29 07:06:29 0 419
Andhra Pradesh
Vangalapudi Anitha: మీవల్లే పోలీసులపై నమ్మకం పెరిగింది.. మహిళా కానిస్టేబుల్ జయశాంతికి మంత్రి అనిత అభినందనలు.
విధి నిర్వహణలో చూపిన చొరవను ప్రత్యేకంగా అభినందించిన మంత్రి జయశాంతి చర్య పోలీసులపై ప్రజల...
By Pagadala Venkateswar 2026-01-20 10:53:20 0 187
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ :సోమలలో పట్టు వస్త్రాలు సమర్పించిన టిటిడి బోర్డు మెంబర్
సోమల మండలానికి సమీపంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల ఆలయంలో శుక్రవారం మొలకల పౌర్ణమి...
By Kothuru Murali 2026-05-01 12:27:14 0 101
Andhra Pradesh
నంద్యాల పార్లమెంట్ కమిటీ ఏర్పాటు !!
కర్నూలు : పాణ్యం : తెలుగుదేశం పార్టీ నంద్యాల పార్లమెంట్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. నంద్యాల...
By Hari Krishna 2025-12-26 16:22:23 0 229
SURAKSHA
M. Haritha, IAS: A Beacon of People-Centric Governance
A dedicated Telangana IAS officer known for transparent administration, citizen-focused...
By Lokeshwari Panthadi 2026-07-15 11:59:29 0 104
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com