నీట్ వివాదంపై ఆల్వాల్‌లో కాంగ్రెస్ ఆందోళన.!

0
30

● ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేసిన కాంగ్రెస్ నేతలు

● విద్యార్థులపై లాఠీచార్జిని ఖండించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి

● దిష్టిబొమ్మ దహనయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్, జూలై 22: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనతో పాటు నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిని ఖండిస్తూ కాంగ్రెస్ నాయకులు బుధవారం ఓల్డ్ ఆల్వాల్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ, నీట్ వ్యవహారంలో నష్టపోయిన విద్యార్థులకు పూర్తి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మల్కాజిగిరి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి తోట లక్ష్మీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రశ్నపత్రం లీకేజీపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు. నిరసన తెలిపిన విద్యార్థులపై బలప్రయోగం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

#sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: రెవెన్యూ శాఖ పరిపాలనకు వెన్నెముక: జేసీ.
మదనపల్లె కలెక్టర్ కార్యాలయంలో శనివారం జరిగిన రెవెన్యూ డే కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ నారాయణ...
By Pagadala Venkateswar 2026-06-21 07:29:41 0 53
SURAKSHA
Bengaluru Traffic Police Teach Road Safety To Kids
: Bengaluru Traffic Police today conducted road safety awareness programs in Koramangala and...
By Kalaga Sailaja 2026-07-06 06:38:06 0 119
Andhra Pradesh
మదనపల్లి: నిందితుడిపై పిడిగుద్దులు.. అదుపుతప్పిన పరిస్థితి.
మదనపల్లెలో బాలిక హత్య కేసులో నిందితుడి ఇంటి వద్దకు మంగళవారం వేలాది మంది స్థానికులు తరలివచ్చారు....
By Pagadala Venkateswar 2026-02-17 11:45:43 0 154
Andhra Pradesh
మదనపల్లి: రైతులకు లాభమే లక్ష్యం - ఏఎంసీ ఛైర్మన్.
మదనపల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ జంగాల శివరాం, సెక్రటరీ జగదీష్‌తో కలిసి మార్కెట్ యార్డును...
By Pagadala Venkateswar 2026-03-03 04:04:08 0 161
Mizoram
Mizoram Focuses on Border Trade and Connectivity Growth
Authorities in Mizoram are reviewing measures to strengthen trade and connectivity in border...
By Navya Sree 2026-06-26 09:44:01 0 46
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com