Madanapalle: భూ రీ-సర్వే వివాదం రైతు కుటుంబంపై దాడి, నలుగురికి గాయాలు!

0
22

Madanapalle: భూ రీ-సర్వే సందర్భంగా తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసి రైతు కుటుంబంపై దాడి జరిగిన ఘటన మదనపల్లె మండలంలో బుధవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడి మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులు తాలూకా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, మదనపల్లె మండలం పోతబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని వందాడి వారిపల్లెకు చెందిన రైతు లక్ష్మన్నకు చెందిన భూమిపై వివాదం కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో లక్ష్మన్న, కృష్ణయ్య లు ఇటీవల కోర్టును ఆశ్రయించి స్టే ఉత్తర్వులు పొందినట్లు తెలిపారు.

 

బుధవారం రెవెన్యూ అధికారులు భూమి రీ-సర్వేకు వచ్చిన సమయంలో లక్ష్మన్న, కృష్ణయ్య కోర్టు స్టే ఉత్తర్వులను అధికారులకు చూపించి, వాటి ప్రకారం సర్వే నిర్వహించాలని కోరారు. ఈ క్రమంలో ప్రత్యర్థి వర్గానికి చెందిన ఎన్. శ్రీనివాసులు, రాధా వర్గీయులు లక్ష్మన్న కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ దాడిలో లక్ష్మన్న, .కె.కృష్ణప్ప, కె. శ్రీనివాసులు, ఈశ్వరమ్మ లు తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు వారిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Search
Categories
Read More
SURAKSHA
Anil Shukla IPS: Leading Mizoram with Courage & Vision
A distinguished 1996-batch AGMUT cadre IPS officer strengthening policing, security, and public...
By Lokeshwari Panthadi 2026-07-23 12:21:38 0 50
Andhra Pradesh
ఏఐఎస్ఎఫ్ నాయకులు వినతి పత్రం అందజేయడం జరిగింది
కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలు  ప్రైవేట్ , కార్పొరేట్ విద్యాసంస్థలు అక్రమంగా...
By Boya Dasthagiri 2026-05-05 16:19:54 0 119
Andhra Pradesh
అమ్మవారి కోవెల కి విచ్చేసినPV సింధు
బ్యాట్మెంటన్ స్టార్ పీవీ సింధు గారు ఈరోజు శ్రీ అమ్మవారి హారతులు అనంతరం దర్శనమునకు విచ్చేసినారు......
By Rajini Kumari 2025-12-23 07:42:48 0 190
Telangana
గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు నేడు – హుజూర్‌నగర్‌లో కేక్ కటింగ్, మెగా రక్తదాన శిబిరం
హుజూర్‌నగర్ / భారత్ అవాజ్ :   తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి,...
By Malla Rambabu 2026-07-18 05:54:56 0 143
Andhra Pradesh
కొమరోలులో దారుణం.. భార్యను గొడ్డలితో హత్య చేసిన భర్త
కొమరోలులో దారుణం.. భార్యను గొడ్డలితో హత్య చేసిన భర్త మార్కాపురం జిల్లా కొమరోలు మండలం...
By Chennaiah Kati 2026-06-10 07:03:59 0 99
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com