MNKLIS Project

0
34

మక్తల్ – నారాయణపేట్ – కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు (MNKLIS) భూ సేకరణ విషయంలో పనులు జాప్యం జరగొద్దని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుతో పాటు కొడంగల్ అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి గారు సమీక్షించారు.

 

✅ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టు భూసేకరణ పనులు జాప్యం జరగొద్దని, భూసేకరణకు అవసరమైన సర్వేయర్ల నియమించడంతో పాటు బడ్జెట్ మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టంగా చెప్పారు. భూసేకరణ పనులను పూర్తి చేసి టెండర్ ప్రక్రియను మొదలు పెట్టాలని ఆదేశించారు.

 

✅ కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (KADA) కింద చేపట్టిన అభివృద్ధి పనులను శాఖల వారిగా సమగ్రంగా సమీక్షించారు. కొనసాగుతున్న ఆయా పనుల వివరాలను తెలుసుకుని అవసరమైన సూచనలు చేశారు.

 

✅ నియోజకవర్గంలోని గ్రామాల్లో రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు సంబంధించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గంలో ఏ తండాలో రోడ్డు లేదన్న మాట వినిపించొద్దు, ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు ఉండేలా చూడాలని చెప్పారు.

 

✅ కొత్త గ్రామ పంచాయతీలకు సంబంధించి పంచాయతీ భవనాలను నిర్మించాలని, ఈఈ స్థాయి అధికారిని నియమించి నిరంతరం పనులు పర్యవేక్షించాలని సూచించారు.

 

✅ ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా ఇప్పటి నుంచే ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

Search
Categories
Read More
Telangana
అసెంబ్లీ నుంచి కేసీఆర్ వెళ్లిపోవడంపై సీఎం రేవంత్ ఏమన్నారంటే
అసెంబ్లీ నుంచి కేసీఆర్ వెళ్లిపోవడంపై సీఎం రేవంత్ ఏమన్నారంటే  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్...
By Pinnehasan Odela 2025-12-29 15:04:09 0 226
Telangana
హైదరాబాద్‌లో HYDRAA ఉద్యోగుల జీతాల తగ్గింపు – ఆందోళనలో సిబ్బంది
హైదరాబాద్,  తెలంగాణ- హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA)...
By BMA ADMIN 2025-08-11 10:52:50 0 2K
Andhra Pradesh
నిమ్మనపల్లెలో యువకుడిపై కోడి కత్తులతో దాడి.
శనివారం రాత్రి నిమ్మనపల్లె మండలం రాతివారిపల్లెలో ప్రైవేట్ బస్సు డ్రైవర్ ఆవుల నరేశ్ (27) పై...
By Pagadala Venkateswar 2026-06-14 06:18:22 0 69
Andhra Pradesh
నేడే ఫిబ్రవరి 21 రైతు ఉత్సవం
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా, ఫిబ్ర‌వ‌రి 20,...
By Rajini Kumari 2026-02-20 23:22:13 0 169
Andhra Pradesh
మదనపల్లెలో అక్రమ లాటరీ టికెట్ల విక్రయం: 10 మంది అరెస్ట్.
మదనపల్లెలో అక్రమంగా లాటరీ టికెట్లు విక్రయిస్తున్న వారిపై పోలీసులు దాడులు నిర్వహించి, ఇద్దరు...
By Pagadala Venkateswar 2026-06-14 06:15:23 0 57
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com