ఆసిఫాబాద్‌లో ఈ నెల 22న మినీ జాబ్ మేళా జిల్లా ఉపాధి అధికారి కిరణ్ కుమార్

0
81

ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్):కుమారం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించేందుకు ఈ నెల 22న (బుధవారం) ఉదయం 10:30 గంటలకు మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి కిరణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జనకపూర్ లోని MPDO ఆఫీస్ పక్కన ఉన్న టాస్క్ సెంటర్ (TASK Center) లో ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ 'ఫోన్‌పే ప్రైవేట్ లిమిటెడ్' (Phonepe PVT LTD) లో గల 15 బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఈ మేళా నిర్వహిస్తున్నారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగి, 18 నుండి 25 సంవత్సరాల వయస్సు ఉన్న మహిళలు మరియు పురుషులు (M/F) ఈ ఉద్యోగాలకు అర్హులు. అభ్యర్థుల వద్ద సొంత బైక్ మరియు 4G/5G స్మార్ట్‌ఫోన్ తప్పనిసరిగా ఉండాలి.ఎంపికైన వారు ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, సిర్పూర్, వాంకిడి, కెరమెరి, బెజ్జూర్, కౌటాల ప్రాంతాలలో పని చేయాల్సి ఉంటుందని, వీరికి నెలకు ₹18,000 నుండి ₹25,000 వరకు జీతం లభిస్తుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డ్ మరియు బయోడేటా (Resume) లతో ఇంటర్వ్యూకి హాజరుకావాలని కోరారు. పూర్తి వివరాల కోసం 7989733351, 9160608476 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని ఆయన స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:కల్లూరులో అగ్నిప్రమాదం
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం కల్లూరులో శుక్రవారం ఒక భవనంలో నుంచి అకస్మాత్తుగా మంటలు...
By Kothuru Murali 2026-05-22 14:25:50 0 84
Andhra Pradesh
రాష్ట్ర కార్యాలయం చైర్మన్ గారికి వినతి పత్రం
రాష్ట్రంలోని మైనారిటీ వక్ఫ్ బోర్డు ఆస్తులను కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ...
By Rajini Kumari 2026-02-05 09:24:49 0 154
Telangana
"బక్రీద్‌కు కట్టుదిట్టమైన భద్రత.. శాంతియుత వేడుకలకు సీపీ సుమతి పిలుపు”|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని మల్కాజిగిరి పోలీస్...
By Sidhu Maroju 2026-05-23 13:22:03 0 214
Telangana
గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులైన  నీలం స్వరూప కుమారుడు క్రాంతి నూతన...
By Pindikura Mahesh 2026-06-26 03:06:35 0 261
Andhra Pradesh
గుర్తుతెలియని వాహనం ఢీకొని డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
మంగళవారం రాత్రి పుంగనూరు మండలం మొరంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ బస్సు డ్రైవర్...
By Kothuru Murali 2026-02-25 11:11:57 0 262
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com