సర్దార్ పటేల్ పోలీస్ అకాడమీలో సంచలనం.. ట్రైనీ ఐపీఎస్‌పై కేసు.|

0
58

–మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదుతో కేసు నమోదు.

–సస్పెన్షన్ అనంతరం విషపూరిత ద్రవం సేవించిన అధికారి.

హైదరాబాద్, జులై 20: దేశంలోనే అత్యున్నత పోలీసు శిక్షణా కేంద్రమైన హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVPNPA)లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. 

తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఫిర్యాదు మేరకు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఎం. ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పరిణామం పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

మహిళా అధికారిణి ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్లతో పాటు సమాచార సాంకేతిక చట్టం (IT Act) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రాథమిక విచారణ అనంతరం అకాడమీ అధికారులు ఉదయ్ కృష్ణారెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది.

ఫిర్యాదు ప్రకారం జూన్ 23 నుంచి వాట్సాప్ ద్వారా అసభ్యకర సందేశాలు పంపడంతో పాటు తోటి ట్రైనీల సమక్షంలో అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపించారు.

జూలై 8న ఆమె మొబైల్ ఫోన్‌ను బలవంతంగా తీసుకుని పాస్‌వర్డ్ తెలుసుకున్న అనంతరం వ్యక్తిగత వీడియోలను రికార్డు చేసి, వాటిని ఆమె భర్తకు పంపి బ్లాక్‌మెయిల్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

అంతేకాకుండా, ఒక సందర్భంలో ఆమెను గదిలోకి బలవంతంగా తీసుకెళ్లి మెడపై కత్తి పెట్టి బెదిరించినట్లు కూడా ఆరోపించారు.

కేసు నమోదు అనంతరం సోమవారం ఉదయం ఉదయ్ కృష్ణారెడ్డి మోతీనగర్‌లోని తన సోదరుడి నివాసంలో విషపూరిత ద్రవం సేవించినట్లు తెలిసింది.

అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే ఎస్‌ఆర్ నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. దీంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.

ఈ ఘటనకు ముందు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చేసిన పోస్టులో తనపై వచ్చిన ఆరోపణలు, జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, చట్టంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని ఉదయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు.

ప్రస్తుతం లైంగిక వేధింపుల కేసుతో పాటు విషపూరిత ద్రవం సేవించిన అంశంపైనా పోలీసులు విడివిడిగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
బ్రహ్మర్షి స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి.
మదనపల్లె పట్టణంలోని బ్రహ్మర్షి స్కూల్ యాజమాన్యం విద్యార్థులతో నీళ్లు మోయిస్తున్న ఘటనపై విమర్శలు...
By Pagadala Venkateswar 2026-04-08 05:40:16 0 127
Telangana
ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ లైసెన్స్, రిజిస్ట్రేషన్ మేళా
మహబూబాబాద్, డిసెంబర్.24(భారత్ అవాజ్): తెలంగాణ రాష్ట్ర ఆహార పరిరక్షణ కమిషనర్ ఆదేశాల మేరకు...
By Bheeshman King 2025-12-24 10:27:56 0 501
Bharat Aawaz
💔 A Mother's Cry Across Borders... Will We Listen?
Kerala - Nimisha Priya, a nurse from Kerala, is facing the death penalty in Yemen.Her only crime?...
By Bharat Aawaz 2025-07-24 09:19:59 0 2K
Telangana
నడిరోడ్డుపై మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్ట్ . ‎
ఇటీవల మణికొండలోని అల్కాపూర్ టౌన్ షిప్ లో ఒక మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ వ్యక్తి...
By Ponnala Srinivasrao 2026-05-25 02:34:26 0 112
Andhra Pradesh
మీడియా సహకారం పోలీసులకు కీలకం: ఎస్పీ ధీరజ్.
మదనపల్లె జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో బుధవారం జిల్లా ఎస్పీ ధీరజ్ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా...
By Pagadala Venkateswar 2026-06-25 06:00:37 0 40
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com