తెలుగుదేశం పార్టీలో చేరిన 150 వైసీపీనుండి కార్యకర్తలు
*అన్నమయ్య జిల్లా*
*రాయచోటి నియోజకవర్గం*
*లక్కిరెడ్డిపల్లె మండలం*
*18-07-2026*
*మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నాయకత్వంపై విశ్వాసం... దప్పేపల్లెలో 150 మంది టీడీపీ గూటికి*
*తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు*
లక్కిరెడ్డిపల్లె మండలం దప్పేపల్లె గ్రామానికి చెందిన *మాజీ ఎంపీటీసీ,మాజీ జడ్పీటీసీ అంబా బత్తిన రెడ్డయ్య ఆధ్వర్యంలో సుమారు 150 మంది నాయకులు, కార్యకర్తలు* తెలుగుదేశం పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రజాహిత పాలనకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన & క్రీడాశాఖల మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు* నూతనంగా పార్టీలో చేరిన వారికి *పార్టీ కండువాలు* కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
మంత్రి గారు మాట్లాడుతూ, *ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో* రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఫలితంగానే అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా *తెలుగుదేశం పార్టీ వైపు అడుగులు వేస్తున్నారని* పేర్కొన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బలిశెట్టి హరిప్రసాద్ గారు, *మండల పార్టీ అధ్యక్షులు మదన్ మోహన్ గారు,* ఆరు మండలాల పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతనంగా పార్టీలో చేరిన వారిని అభినందించారు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz