తెలుగుదేశం పార్టీలో చేరిన 150 వైసీపీనుండి కార్యకర్తలు

0
34

*అన్నమయ్య జిల్లా*

*రాయచోటి నియోజకవర్గం*

*లక్కిరెడ్డిపల్లె మండలం*

*18-07-2026*

 

*మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నాయకత్వంపై విశ్వాసం... దప్పేపల్లెలో 150 మంది టీడీపీ గూటికి*

 

*తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు*

 

లక్కిరెడ్డిపల్లె మండలం దప్పేపల్లె గ్రామానికి చెందిన *మాజీ ఎంపీటీసీ,మాజీ జడ్పీటీసీ అంబా బత్తిన రెడ్డయ్య ఆధ్వర్యంలో సుమారు 150 మంది నాయకులు, కార్యకర్తలు* తెలుగుదేశం పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రజాహిత పాలనకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరారు.

 

ఈ సందర్భంగా *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన & క్రీడాశాఖల మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు* నూతనంగా పార్టీలో చేరిన వారికి *పార్టీ కండువాలు* కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

 

మంత్రి గారు మాట్లాడుతూ, *ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో* రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఫలితంగానే అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా *తెలుగుదేశం పార్టీ వైపు అడుగులు వేస్తున్నారని* పేర్కొన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు.

 

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బలిశెట్టి హరిప్రసాద్ గారు, *మండల పార్టీ అధ్యక్షులు మదన్ మోహన్ గారు,* ఆరు మండలాల పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతనంగా పార్టీలో చేరిన వారిని అభినందించారు.

Search
Categories
Read More
Lakshdweep
Massive 1800 Year Old Potato Patch Coral Discovered In Lakshadweep
A remarkable UNDP survey near Kadmat Island, Lakshadweep, identified a colossal Pavona clavus...
By Tejaswini Komanduru 2026-06-05 10:29:20 0 465
Andhra Pradesh
ఇసుక అక్రమ రవాణాపై కొరడా
బొబ్బిలి మండలంలోని ఇసుక అక్రమ రవాణాపై రెవెన్యూ అధికారులు కొరడా ఝాలిపించారు. బొబ్బిలి మండలంలోని...
By Boiena Rajesh 2026-03-13 04:41:48 0 215
Tamilnadu
Tamilnadu tvk party
మహిళా దినోత్సవ వేడుకల్లో టీవీకే అధినేత విజయ్ వరాలు మా ప్రభుత్వం వచ్చాక మహిళలకు నెలకు రూ.2500...
By G k Nookala 2026-03-07 18:00:11 0 237
Chandigarh
Chandigarh to Roll Out Monthly Parking Pass Across the City
In a move towards simplifying city transport and parking, the Chandigarh Municipal Corporation...
By Bharat Aawaz 2025-07-17 05:44:04 0 1K
Andhra Pradesh
Nara Lokesh: ఏపీకి రావాలంటూ ఫిన్‌టెక్, ఏఐ, గ్రీన్ ఎనర్జీ సంస్థలకు ఆహ్వానం... దావోస్‌లో వ్యాపార దిగ్గజాలతో లోకేశ్ చర్చలు.
దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మంత్రి లోకేశ్ బిజీబిజీ విశాఖలో టెక్నాలజీ...
By Pagadala Venkateswar 2026-01-21 14:39:02 0 143
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com