ఆరోగ్య బాగుకై అర్హులైన నిరుపేదలు ముఖ్యమంత్రి సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలి : బిఆర్ ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్.

0
1K

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే  నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి పలువురు ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తుదారులకు బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్  ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరు చేయించిన 4.30 లక్షల రూపాయల విలువ గల మూడు ఎల్వోసీ చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా 125 - గాజుల రామారం డివిజన్ ఇందిరా నగర్ - బి ప్రాంతానికి చెందిన ఎన్.అర్జున్ కేరాఫ్ విజయ్ కుమార్ (24), 132 - జీడిమెట్ల డివిజన్ వినాయక్ నగర్ కాలనీకి చెందిన చిన్నారి పలివన్ అజీజ్ తండ్రి పలివన్ ఇస్మాయిల్ (3), దుండిగల్ మున్సిపాలిటీ పరిధి దుండిగల్ వార్డుకు చెందిన తిలక్ జ్యోతి తండ్రి టి. అశోక్ (30) ల ఆరోగ్య పరిస్థితి బాగాలేదని స్థానిక నాయకుల ద్వారా సమాచారం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారు వైద్య నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధులను మంజూరు చేయించి లబ్ధిత కుటుంబ సభ్యులకు ఎల్వోసీ చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... ఆరోగ్య బాగుకై అర్హులైన నిరుపేదలు ముఖ్యమంత్రి సహాయనిధిని సద్వినియోగం చేసుకొని మెరుగైన వైద్యాన్ని పొందాలన్నారు.ఈ కార్యక్రమంలో గాజుల రామారం డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విజయ్ రాంరెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కుంట సిద్ధిరాములు, నదీమ్ రాయ్, ఇబ్రహీం బేగ్, అడ్వకేట్ కమలాకర్, మూసా ఖాన్, బోయిని మహేష్, సంధ్యా రెడ్డి, శ్రీదేవి రెడ్డి, యాదగిరి, జునైద్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
Heartfelt Congratulations!
Proud moment as Padmini has secured an impressive Rank 4191 in TG LAWCET 2025 (LL.B. 5 Years)...
By Sidhu Maroju 2025-06-26 11:15:39 1 2K
Andhra Pradesh
కర్నూలు లో మాంసం దుకాణాల తనిఖీలు
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానస అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడు ఈరోజు కర్నూల్లో పలు...
By Hari Krishna 2025-12-14 09:16:43 0 296
Telangana
తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు, యూనివర్సిటీలను ఇక మీదట ప్రభుత్వ...
By Pinnehasan Odela 2025-12-21 07:20:16 0 276
Andhra Pradesh
Anam Ramanarayana Reddy: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేసిన మంత్రి ఆనం.
2014 నుంచి పక్కాగా సాగుతున్న టెండర్ల వ్యవస్థను తుంగలో తొక్కారన్న ఆనం నిబంధనలను ఐదు నెలల...
By Pagadala Venkateswar 2026-02-24 10:51:43 0 217
Telangana
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. తెరపైకి మరో పేరు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో గోవాకు చెందిన డీజే క్లింటన్...
By Veeresh Kumar 2026-03-30 06:21:47 0 380
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com