టీపీసీసీ కీలక నిర్ణయం...పాలభిషేకాలు, జేసీబీలపై నిషేధం.|

0
42

హైదరాబాద్, జూలై 16 : కాంగ్రెస్ పార్టీ అధికారిక వేడుకలు, కార్యక్రమాల్లో ఆడంబరాలకు, ఆహార వృథాకు అడ్డుకట్ట వేస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ నిర్వహించే ఎలాంటి కార్యక్రమాల్లోనైనా సరే పాలభిషేకాలు, జలాభిషేకాలు చేయడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. 

ఈ మేరకు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ టి. కుమార్ రావు ఒక అధికారిక సర్క్యులర్ లేఖను విడుదల చేశారు.తెలంగాణ ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వెల్లడించింది. 

దేశంలో ఎంతో మంది పోషకాహార లోపంతో బాధపడుతుంటే, వేడుకల పేరిట పాలను, ఇతర ఆహార పదార్థాలను వృథా చేయడం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు, ఆదర్శాలకు పూర్తి విరుద్ధమని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఇటువంటి వృథా పనులకు స్వస్తి చెప్పి, పేదలకు ఆహార పంపిణీ కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఇదే సమయంలో సీనియర్ నాయకుల పర్యటనల్లో జేసీబీలు, బుల్డోజర్లు, భారీ క్రేన్లను ఉపయోగించి భారీ పూలదండలు వేసే సంస్కృతిపై టీపీసీసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బుల్డోజర్లు, జేసీబీ వంటి వాహనాలు అణచివేతకు ప్రతీకలని, ప్రజా పక్షాన నిలిచే కాంగ్రెస్ సంస్కృతికి ఇవి ఏమాత్రం తగవని స్పష్టం చేసింది.ఇకపై పార్టీ నాయకుల సన్మానాల కోసం ఇలాంటి భారీ యంత్రాలను ఉపయోగిస్తే కఠిన క్రమశిక్షణా చర్యలు ఉంటాయని హెచ్చరించింది. 

ఈ కొత్త నిబంధనలను రాష్ట్రంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు అందరూ కచ్చితంగా పాటించాలని టీపీసీసీ స్పష్టం చేసింది.

#Sidhumaroju

Search
Categories
Read More
Business & Finance
Credit Score Check for Better Loan Eligibility Today
A credit score check helps you understand your financial health and borrowing eligibility before...
By Navya Sree 2026-07-23 05:58:15 0 20
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా ప్రజలకు ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన SP.
అన్నమయ్య జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ ధీరజ్ "శ్రీ పరాభవ" నామ ఉగాది మరియు పవిత్ర రంజాన్ పండుగ...
By Pagadala Venkateswar 2026-03-20 03:42:48 0 165
Andhra Pradesh
, తిరుపతి: నేడు యస్.వి.యు డిగ్రీ ఫలితాలు విడుదల
తిరుపతి యస్.వి యు.డిగ్రీ ఫలితాలు ఏప్రిల్ లో వ్రాసిన బి.ఏ, బికామ్, బియస్.సి ఫలితాలు నేడు విడుదల...
By Karapati Gopi 2025-12-29 01:17:09 0 305
Andhra Pradesh
మదనపల్లె: భూ వివాదం.. ఇరు వర్గాల ఘర్షణ.
శనివారం అర్ధరాత్రి మదనపల్లె మండలంలోని ఎనమలవారిపల్లెలో భూ వివాదం కారణంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ...
By Pagadala Venkateswar 2026-06-22 07:00:02 0 58
Telangana
"శాంతి శ్రీనివాసరెడ్డి నిరంతర కృషి.. డోబి ఘాట్ కు మళ్లీ నీటి హర్షం!”
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి  నిరంతర ప్రయత్నాలు...
By Sidhu Maroju 2026-04-15 13:21:30 0 190
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com