Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ప్రభుత్వ కమ్యూనిటీ పర్పస్ (CP) భూముల కబ్జాలపై బహుజన యువసేన (BYS) ఆగ్రహం వ్యక్తం చేసింది.

0
40

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని ప్రభుత్వ లేఅవుట్లలో ప్రజా అవసరాల కోసం కేటాయించిన కమ్యూనిటీ పర్పస్ (సీపీ) స్థలాలపై జరుగుతున్న ఆక్రమణలను వెంటనే అరికట్టాలని బహుజన యువసేన (BYS) రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ కుమార్ అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణంలోని 21 ప్రభుత్వ లేఅవుట్లలో ఉన్న కమ్యూనిటీ పర్పస్ స్థలాలపై వెంటనే సమగ్ర సర్వే నిర్వహించాలని కోరారు.

 

ప్రభుత్వ భూముల్లో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను తక్షణమే తొలగించి, ఆ స్థలాలను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, ప్రభుత్వ భూములను ఆక్రమించిన వ్యక్తులపై, అలాగే ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికారులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

పునీత్ కుమార్ మాట్లాడుతూ, "ప్రజల సామాజిక అవసరాల కోసం కేటాయించిన కమ్యూనిటీ పర్పస్ స్థలాలను ఆక్రమించడం ప్రజా ద్రోహంతో సమానం. అధికారులు నిద్రమత్తు వీడి ప్రభుత్వ భూములను పరిరక్షించే బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలి. లేనిపక్షంలో బహుజన యువసేన ఆధ్వర్యంలో దశలవారీగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం" అని హెచ్చరించారు.

Search
Categories
Read More
SURAKSHA
Anoop Kuruvila John, IPS: A Visionary Leader in Modern Policing
The Journey Begins "The true strength of policing lies not only in enforcing the law but also in...
By Fathima Safa 2026-07-16 09:36:02 0 81
Andhra Pradesh
బాపట్ల జిల్లా పోలీసులు సముద్రతీరా ప్రాంతాలలో విజిబుల్ పోలీసింగ్ 
బాపట్ల జిల్లా పోలీసులు సముద్రతీరా ప్రాంతాలలో విజిబుల్ పోలీసింగ్    చీరాల: బాపట్ల...
By Gadiyapudi Narendra 2026-01-17 16:36:56 0 204
Uttar Pradesh
UP Schools Nominated for World’s Best School Prizes
In a moment of immense pride for Uttar Pradesh, two prominent institutions—the "Healthy...
By Lokeshwari Panthadi 2026-06-30 07:12:50 0 42
Telangana
నేలకొండపల్లిలో యూరియా కష్టాల నుంచి ఊరట..
నేలకొండపల్లి మండలంలో ప్రభుత్వ యూరియా యాప్ ద్వారా ఎరువుల పంపిణీ సజావుగా సాగుతోందని మండల వ్యవసాయ...
By Krishna Balina 2026-02-09 06:00:54 0 198
Andhra Pradesh
Chandrababu Naidu: చంద్రబాబు విజన్ అమోఘం... డబుల్ ఇంజిన్ సర్కారుకు ఆయనే నిదర్శనం: జితేంద్ర సింగ్
Chandrababu Naidu: చంద్రబాబు విజన్ అమోఘం... డబుల్ ఇంజిన్ సర్కారుకు ఆయనే నిదర్శనం: జితేంద్ర...
By Pagadala Venkateswar 2026-02-08 11:18:20 0 184
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com