గాంధీభవన్‌లో మల్కాజిగిరి పార్లమెంట్ సమావేశం – కాంగ్రెస్ బలోపేతంపై దృష్టి

0
260

హైదరాబాద్, మే 30: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించాలని పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది. శనివారం గాంధీభవన్ ప్రాంగణంలోని ఇందిరా భవన్‌లో నిర్వహించిన మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో ఈ అంశాలపై విస్తృతంగా చర్చించారు.

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం, బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం, డివిజన్ అధ్యక్షుల ఎంపిక, అనుబంధ సంఘాల కమిటీల ఏర్పాటు తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు.

హైదరాబాద్‌లోని గాంధీభవన్ ప్రాంగణంలోని ఇందిరా భవన్‌లో ఈ సమావేశం జరిగింది.

 శనివారం నిర్వహించిన ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ ఆధ్వర్యం వహించారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ సమావేశంలో పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్యేలు, పార్లమెంట్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు హాజరయ్యారు.

రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, బూత్ స్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయడం, రాబోయే రాజకీయ కార్యక్రమాలకు సిద్ధం కావడం లక్ష్యంగా ఈ సమావేశాన్ని నిర్వహించారు.

 

సమావేశంలో మాట్లాడిన మీనాక్షి నటరాజన్ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్ లెవెల్ ఏజెంట్లు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల కమిటీలను త్వరితగతిన ఏర్పాటు చేయాలని సూచించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ బలోపేతానికి అవసరమైన సూచనలు, కార్యాచరణపై నాయకులకు మార్గనిర్దేశం చేశారు.

కూకట్పల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ బండి రమేష్ మాట్లాడుతూ, కూకట్పల్లి అసెంబ్లీ పరిధిలో బీఎల్‌ఏల నియామకాలపై నిర్వహించిన సమావేశాల వివరాలను పార్టీ రాష్ట్ర నాయకత్వానికి సమగ్ర నివేదిక రూపంలో అందజేశామని తెలిపారు. పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలను అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Shri Santhosh B. M., IAS: Leading Telangana's Progress
A dynamic 2017-batch Telangana cadre IAS officer, Shri Santhosh B. M. has earned recognition for...
By Lokeshwari Panthadi 2026-07-14 06:26:26 0 91
Telangana
Hyderabad: Police register case following fire tragedy at Gulzar Houz
Hyderabad: Police register case following fire tragedy at Gulzar Houz area that claimed 17 lives...
By BMA ADMIN 2025-05-19 17:28:31 0 3K
Telangana
నిజామాబాద్ : చిత్తశుద్ధితో పనిచేయాలి
ప్రభుత్వం ప్రతిష్టా ఆత్మకంగా చేపడుతున్న ప్రజా పాలన ప్రగతి విజయవంతానికి చిత్తశుద్దితో క్రుషి...
By Sadaq Sadaq 2026-03-04 16:28:00 1 206
Andhra Pradesh
సూర్య భగవానుడిని దర్శనం చేసుకుని వస్తుండగా ఘోరం.. తల్లీ,కొడుకు మృతి.. ఒళ్ళు గగుర్పాటుకు గురి చేస్తున్న దృశ్యం!
జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తండ్రీ కొడుకులు ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు...
By Manda Ramkumar 2026-03-27 07:03:12 0 187
SURAKSHA
Operation Parivartan: AP Police's Mission for Drug-Free Society
The 'Operation Parivartan' led by the Andhra Pradesh Police is a historic initiative for tribal...
By Kalaga Sailaja 2026-06-24 06:04:39 0 89
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com