Madanapalle: మదనపల్లె కురవంకలో విజయ భారతి క్రికెట్ అకాడమీ ఘనంగా ప్రారంభం. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు నాణ్యమైన శిక్షణ ఇవ్వడమే లక్ష్యం.

0
50

మదనపల్లె: యువ క్రికెటర్లలో ప్రతిభను వెలికితీసి వారికి నాణ్యమైన శిక్షణ అందించాలనే లక్ష్యంతో విజయ భారతి క్రికెట్ అకాడమీని శుక్రవారం కురవంకలో ఘనంగా ప్రారంభించారు. విజయభారతి విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎన్. సేతు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కురవంక మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి అకాడమీని అధికారికంగా ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా కురవంక మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత యువతలో దాగి ఉన్న క్రికెట్ ప్రతిభను వెలికితీసి వారికి నాణ్యమైన శిక్షణ అందించేందుకు విజయ భారతి క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ అకాడమీ ద్వారా భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులు తయారవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

విజయభారతి విద్యా సంస్థల ప్రిన్సిపాల్ నిశ్చితా సేతు మాట్లాడుతూ, విద్యతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధే తమ సంస్థ లక్ష్యమని తెలిపారు. యువతకు అత్యుత్తమ క్రికెట్ శిక్షణ అందించి వారి ప్రతిభను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే విధంగా అకాడమీని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు, విద్యార్థులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Uncategorized
సంగారెడ్డి జిల్లా హుగ్గెల్లిలో ఏర్పాటు చేసిన బసవేశ్వరుని విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఆవిష్కరించనున్నారు.
సంగారెడ్డి జిల్లా హుగ్గెల్లిలో ఏర్పాటు చేసిన బసవేశ్వరుని విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు...
By BMA ADMIN 2025-05-23 05:29:23 0 2K
Uttar Pradesh
Severe Storm Claims 89 Lives in UP: CM Yogi Orders Immediate Relief
Tragedy struck Uttar Pradesh on May 13th and 14th as a violent storm, accompanied by heavy rain...
By Dunna Jessicaruth 2026-05-14 08:42:35 0 117
Andhra Pradesh
విజయనగరంలో రేపు జాబ్ మేళా..
విజయనగరం MR కాలేజీలో ఈనెల 17న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వహీదా గురువారం...
By Boiena Rajesh 2026-04-16 13:54:14 0 185
Andhra Pradesh
తుని నియోజకవర్గం చామవరంలో పేదల సేవా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
*For scrolls*   *కాకినాడ జిల్లా:*   *తుని నియోజకవర్గం చామవరంలో పేదల సేవలో...
By Rajini Kumari 2026-06-01 12:20:59 0 131
Telangana
పలు ఆలయాలను సందర్శించుకున్న కార్పొరేటర్ రాజ్ జితేంద్ర నాథ్
మల్కాజ్గిరి జిల్లా / అల్వాల్ బోనాల పర్వదినాన్ని పురస్కరించుకొని మచ్చబొల్లారం, హరిజన బస్తీ,...
By Sidhu Maroju 2025-07-20 14:34:23 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com