గుంటూరు జిల్లాలో ప్రత్యేక ట్రాఫిక్ డ్రైవ్ – 720 చలానాలు, రూ.4,74,080 /- జరిమానా; 720 మందికి రోడ్డు భద్రత అవగాహన

0
81

గుంటూరు జిల్లాలో ప్రత్యేక ట్రాఫిక్ డ్రైవ్ – 720 చలానాలు, రూ.4,74,080 /- జరిమానా; 720 మందికి రోడ్డు భద్రత అవగాహన

గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతను మెరుగుపరచడం, ట్రాఫిక్ నిబంధనల అమలును కట్టుదిట్టం చేయడం లక్ష్యంగా నిన్నటి రోజు(09.07.2026)న సాయంత్రం 5.00 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ట్రాఫిక్ అమలు (Special Enforcement Drive) కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ ప్రత్యేక డ్రైవ్‌లో జిల్లాలోని 31 బ్లాక్ స్పాట్లు మరియు మరో 21 ఇతర కీలక ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై మొత్తం 720చలానాలు నమోదు చేసి రూ.4,74,080 జరిమానా విధించారు.

ఈ ప్రత్యేక డ్రైవ్ సందర్భంగా నమోదైన ఉల్లంఘనలు:-

హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులపై మరియు కార్ లో సీట్ బెల్ట్ ధరించని వారిపై 250 కేసులు.

ట్రిపుల్ రైడింగ్‌పై – 53 కేసులు.

ప్రమాదకరంగా వాహనాలు నడిపిన వారిపై – 28 కేసులు.

రాంగ్ సైడ్ డ్రైవింగ్‌పై – 16 కేసులు

మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపిన వారిపై – 16 కేసులు.

మద్యం సేవించి వాహనం నడిపిన 4 మందిపై కేసులు నమోదు చేశారు.

మైనర్ డ్రైవింగ్ చేసినవారు 3 కేసులు నమోదు చేశారు.

ఇతర మోటారు వాహన చట్ట ఉల్లంఘనలకు సంబంధించి 198 కేసులు నమోదు చేసినారు.

అదేవిధంగా రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు మరియు హెల్మెట్ వాడకంపై జిల్లా వ్యాప్తంగా 15 రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల ద్వారా 220 మంది డ్రైవర్లు, 85 మంది విద్యార్థులు, 415 మంది సాధారణ ప్రజలకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. మొత్తం 720 మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, హెల్మెట్ ధరించడం, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం, మొబైల్ ఫోన్ వినియోగించకుండా డ్రైవింగ్ చేయడం ద్వారా, రాత్రివేళ నిదర టైములో డ్రైవింగ్ చేయ కుండా ఉండటం వలన ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.

ప్రజల ప్రాణ భద్రతే లక్ష్యంగా ఇటువంటి ప్రత్యేక అమలు డ్రైవ్‌లు, రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిరంతరం కొనసాగుతాయని గుంటూరు జిల్లా పోలీసులు తెలిపారు.

Search
Categories
Read More
Telangana
"సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన చిలకలగూడ పోలీసులు.|
హైదరాబాద్ : నగరాన్ని సైబర్ నేరాల నుంచి రక్షించేందుకు “జాగృతి హైదరాబాద్ – సురక్షిత...
By Sidhu Maroju 2026-05-16 13:50:33 0 178
Andhra Pradesh
Chandrababu Naidu: ఈ నెల 24న ఏపీ కేబినెట్ భేటీ.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ ఉత్తర్వులు జారీ చేసిన...
By Pagadala Venkateswar 2026-02-19 06:54:12 0 166
Andhra Pradesh
కేరళ రాజధాని త్రివేండ్రం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 56 మంది గెలుపు
*కేరళ* రాజధాని *త్రివేండ్రం* (తిరువనంతపురం) మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో *56* మంది...
By Rajini Kumari 2026-02-10 10:35:15 0 189
Telangana
ఆన్ లైన్ బెట్టింగులకు బానిసైన ఓ పోలీసు కథ.,|
హైదరాబాదు :  ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.కోటిన్నర పోగొట్టుకున్న అంబర్‌పేట్ ఎస్ఐ...
By Sidhu Maroju 2025-11-27 08:01:04 0 187
Andhra Pradesh
మార్చి31న యధావిధిగా బ్యాంకులు
మార్చి 31న యధావిధిగా బ్యాంకులు మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో RBI.. బ్యాంకులకు కీలక...
By Chennaiah Kati 2026-02-09 04:54:02 0 257
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com