గోపాల్ నగర్ ప్రధాన రహదారి సమస్యను త్వరితగతిన పరిష్కారం అయ్యేలా కృషి చేస్తాను: బండి రమేష్

0
81

 

 

హైదరాబాద్, కుక్కట్ పల్లి, గోపాల్‌నగర్ మెయిన్ రోడ్ ప్లాట్ యజమానుల విజ్ఞప్తి మేరకు శ్రీ బండి రమేష్ గారు ఈరోజు గోపాల్‌నగర్ ప్రధాన రహదారిని సందర్శించి, అక్కడి ప్లాట్ యజమానులతో సమావేశమై వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ప్లాట్ యజమానులు మాట్లాడుతూ, గోపాల్‌నగర్ లేఅవుట్ 1980లో ఏర్పడిందని, 1981లో ప్లాట్లను కొనుగోలు చేశామని తెలిపారు. అప్పట్లో ఆమోదించబడిన లేఅవుట్‌లో ప్రధాన రహదారి వెడల్పు 40 అడుగులుగా మాత్రమే ఉందని, తమ వద్ద ఉన్న అన్ని రిజిస్టర్డ్ అమ్మకపు పత్రాల్లో (Sale Deeds) కూడా 40 అడుగుల రహదారే నమోదై ఉందని వివరించారు.మూసాపేట నుండి లింగంపల్లి వరకు ఇదే రహదారి అనేక ప్రాంతాల్లో 60 నుండి 80 అడుగుల వెడల్పుతో మాత్రమే ఉందని, అలాంటప్పుడు గోపాల్‌నగర్ ప్రాంతంలో మాత్రమే 120 అడుగుల రహదారి పేరుతో భూములను సేకరించడం పూర్తిగా అన్యాయమని తెలిపారు.ఈ సమస్య గత 40 సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా కొనసాగుతోందని, చట్టబద్ధంగా కొనుగోలు చేసిన ప్లాట్ యజమానుల హక్కులను ప్రభుత్వం పరిరక్షించాలని వారు శ్రీ బండి రమేష్ గారిని కోరారు.

ప్లాట్ యజమానుల వినతిని, సంబంధిత పత్రాలను పరిశీలించిన అనంతరం శ్రీ బండి రమేష్ గారు సమస్య తీవ్రతను గుర్తించి, సంబంధిత అధికారులతో చర్చించి ఈ సమస్యకు వీలైనంత త్వరగా న్యాయమైన పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

గోపాల్‌నగర్ మెయిన్ రోడ్ ప్లాట్ యజమానులు ఈ సందర్భంగా శ్రీ బండి రమేష్ గారికి తమ సమస్యను ప్రత్యక్షంగా పరిశీలించి భరోసా కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ బాబు, వినోద్ చావా, శ్రీనివాస్, తిలక్, అనిల్, సుధాకర్, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Business & Finance
GST Composition Scheme for Small Business Compliance
The GST Composition Scheme is a simplified taxation scheme designed for eligible small businesses...
By Navya Sree 2026-07-24 06:22:16 0 16
Andhra Pradesh
శ్రీ శక్తి అమ్మ స్వామి ఆశీర్వాదాలు పొందిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
తమిళనాడులోని వేలూరు లో ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్ సృష్టికర్త శ్రీ శక్తి అమ్మ...
By Benguluri Madhubabu 2026-04-18 14:08:27 0 211
Andhra Pradesh
ఉమ్మడి  పశ్చిమ గోదావరి జల్లా పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్ధిక మంత్రి N.sitharaman ఈ రోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఉమ్మడి  పశ్చిమ గోదావరి జల్లా పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్ధిక మంత్రి N.Sitharaman ఈ రోజు పలు...
By Gadiyapudi Narendra 2025-12-28 16:44:15 0 245
Andhra Pradesh
కిష్టవరం టోల్గేట్ వద్ద కిలోమీటర్ మేర భారీగా వాహనాలు , పట్టించుకోకుండా సర్వర్ ఇష్యూ అంటూ సిబ్బంది, ఎన్ని రోజులు ఈ అగపాట్లు అంటూ ప్రయాణికులు!
కిర్లంపూడి,కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్గేటు వద్ద గురువారం కిలోమీటర్ల కొద్దీ వాహనాల రద్దీ ఉండడం,...
By Nandika Jayababu 2026-04-30 18:49:59 0 385
Telangana
ప్రతి ఓటు రక్షణే లక్ష్యం: శ్రీనివాస్ వర్మ.|
"అల్వాల్‌లో సీనియర్ సిటిజన్స్‌కు SIRపై అవగాహన సదస్సు" మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :...
By Sidhu Maroju 2026-07-01 14:00:24 0 135
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com