మహంకాళి బోనాలకు పటిష్ట బందోబస్తు.|

0
101

"భక్తులసౌకర్యమే లక్ష్యం..

సమన్వయంతో ఏర్పాట్లు"

సికింద్రాబాద్, జూలై 10: లష్కర్‌లో జరిగే ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితమూర్తి తెలిపారు. 

ఈ మేరకు విశ్వకర్మ సంఘంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఆగస్టు 2, 3 తేదీల్లో జరిగే ఉత్సవాలు, రంగం కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.

మహిళల కోసం ప్రత్యేకంగా రెండు క్యూ లైన్లతో పాటు మొత్తం నాలుగు క్యూ లైన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

భక్తులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. 

జాతర విజయవంతానికి ప్రజలు సహకరించాలని డీసీపీ విజ్ఞప్తి చేశారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లెలో ఉచిత హాకీ శిబిరం: 5-15 ఏళ్ల విద్యార్థులకు అవకాశం.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో గురు హాకీ క్లబ్, ఆరోగ్యమాత ఇంగ్లీష్ మీడియం పాఠశాల సహకారంతో సోమవారం...
By Pagadala Venkateswar 2026-05-05 06:25:52 0 103
Business & Finance
Section 8 Company: A Smart Choice for Social Impact
A Section 8 Company is a non-profit organization registered under the Companies Act, 2013. It is...
By Navya Sree 2026-07-18 05:36:31 0 34
Telangana
మర్రి రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా లేబర్ కార్డుల పంపిణీ.|
మల్కాజ్‌గిరి: అల్వాల్‌లో కార్మికుల సంక్షేమానికి సంబంధించిన కీలక కార్యక్రమం ఘనంగా...
By Sidhu Maroju 2026-04-01 17:00:19 0 178
Business & Finance
D-Day 2026 Business Summit Boosts Kerala's Investment Ecosystem
Kochi successfully hosted D-Day 2026, one of Kerala's largest business summits, bringing together...
By Navya Sree 2026-07-04 05:45:01 0 34
Andhra Pradesh
కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది : ధర్మవరం సుబ్బారెడ్డి
కర్నూలు : 2025 కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేరుస్తూ, రాష్ట్రం అభివృద్ధి...
By Hari Krishna 2025-12-30 16:25:52 0 224
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com