సరైన సమయంలో వైద్య సేవలు అందక గిరిజన యువత మృతి!

0
72

చింతూరు డివిజన్ ఏజెన్సీ మారుమూల గిరిజన ప్రాంతం కర్మన్ కొండ లో గత మూడురోజుల క్రితం పాముకాటుకు గురైన యువతి సూట్రు సమ్మక్క ప్రియ (18) సంవత్సరాలు డోలిమోతతో కూటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో చికిత్స నిమిత్తం చేర్పించినా సంగతి విదితమే. ఈరోజు సమ్మక్క ప్రియ విజయవాడ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. వివరాల ప్రకారం పాముకాటు వేసిన సోమవారం రాత్రి చికిత్స కోసం కూటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో చేర్పించగా వైద్యులు అందుబాటులో లేకపోవడం వలన చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించడం జరిగింది. చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితి విషమించడంతో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు అక్కడ కూడా పరిస్థితి విషమంగానే ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించడం జరిగింది. అక్కడ చికిత్స పొందుతూ సమ్మక్క ప్రియా ఆరోగ్యం విషమించడంతో ఈరోజు తుది శ్వాస విడిచారు. సమ్మక్క ప్రియ మరణ వార్త వినగానే కళాశాల స్నేహితులు గ్రామస్తులు కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అమాయకపు ఆదివాసి గిరిజనులు సరైన వైద్య సేవలు లేక ఇలా అనేకమంది చింతూరు డివిజన్ ఏజెన్సీలో మరణించిన కథనాలు అనేకం,ఇప్పటికైనా ప్రభుత్వం గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అనేక గిరిజన సంఘాలు ప్రభుత్వాన్ని కోతున్నాయి.

 

# Yadagiri 

Search
Categories
Read More
Telangana
రిచ్ మాక్స్ గోల్డెన్ బ్రాంచ్ ప్రారంభం.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  అల్వాల్లో ప్రారంభమైన ప్రముఖ గోల్డ్ లోన్ కంపెనీ రిచ్ మాక్స్...
By Sidhu Maroju 2025-08-30 14:26:19 0 394
Business & Finance
J&K Seeks Relief to Ease Livestock Transport Costs
Jammu and Kashmir Chief Minister Omar Abdullah has urged the Punjab Government to address alleged...
By Navya Sree 2026-06-30 05:25:38 0 45
Andhra Pradesh
హాస్టల్స్‌లో వసతుల జిఓ 46 ఎందుకు అమలు చేయడం లేదు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
హాస్టల్స్‌లో వసతుల జిఓ 46 ఎందుకు అమలు చేయడం లేదు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు...
By Gadiyapudi Narendra 2026-01-03 16:50:11 0 393
SURAKSHA
.. మాదకద్రవ్యాల రహిత ఆంధ్రప్రదేశ్ కోసం పోరాటం
మాదకద్రవ్యాలు సమాజానికి పట్టిన చీడ పురుగులు. ఇవి యువత భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా,...
By Kalaga Sailaja 2026-06-26 09:33:07 0 42
Andhra Pradesh
అభివృద్ధి పనులను వేగవంతం చేయండి: జేసీ.
శుక్రవారం మదనపల్లెలో నిర్వహించిన సమీక్షలో, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ PKMUDA పరిధిలో...
By Pagadala Venkateswar 2026-06-06 05:45:29 0 80
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com