సరైన సమయంలో వైద్య సేవలు అందక గిరిజన యువత మృతి!

0
75

చింతూరు డివిజన్ ఏజెన్సీ మారుమూల గిరిజన ప్రాంతం కర్మన్ కొండ లో గత మూడురోజుల క్రితం పాముకాటుకు గురైన యువతి సూట్రు సమ్మక్క ప్రియ (18) సంవత్సరాలు డోలిమోతతో కూటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో చికిత్స నిమిత్తం చేర్పించినా సంగతి విదితమే. ఈరోజు సమ్మక్క ప్రియ విజయవాడ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. వివరాల ప్రకారం పాముకాటు వేసిన సోమవారం రాత్రి చికిత్స కోసం కూటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో చేర్పించగా వైద్యులు అందుబాటులో లేకపోవడం వలన చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించడం జరిగింది. చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితి విషమించడంతో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు అక్కడ కూడా పరిస్థితి విషమంగానే ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించడం జరిగింది. అక్కడ చికిత్స పొందుతూ సమ్మక్క ప్రియా ఆరోగ్యం విషమించడంతో ఈరోజు తుది శ్వాస విడిచారు. సమ్మక్క ప్రియ మరణ వార్త వినగానే కళాశాల స్నేహితులు గ్రామస్తులు కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అమాయకపు ఆదివాసి గిరిజనులు సరైన వైద్య సేవలు లేక ఇలా అనేకమంది చింతూరు డివిజన్ ఏజెన్సీలో మరణించిన కథనాలు అనేకం,ఇప్పటికైనా ప్రభుత్వం గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అనేక గిరిజన సంఘాలు ప్రభుత్వాన్ని కోతున్నాయి.

 

# Yadagiri 

Search
Categories
Read More
Bharat Aawaz
⚖️ Article 15 – The Promise of Equality Still Waiting to Be Fulfilled!
𝑾𝒆 𝒕𝒉𝒆 𝒑𝒆𝒐𝒑𝒍𝒆 𝒐𝒇 𝑰𝒏𝒅𝒊𝒂 𝒈𝒂𝒗𝒆 𝒐𝒖𝒓𝒔𝒆𝒍𝒗𝒆𝒔 𝒕𝒉𝒊𝒔 𝑪𝒐𝒏𝒔𝒕𝒊𝒕𝒖𝒕𝒊𝒐𝒏… 𝑩𝒖𝒕 𝒂𝒓𝒆 𝒘𝒆 𝒕𝒓𝒖𝒍𝒚 𝒕𝒓𝒆𝒂𝒕𝒊𝒏𝒈 𝒆𝒂𝒄𝒉...
By Bharat Aawaz 2025-06-25 17:46:56 0 1K
Andhra Pradesh
APSP: ఏపీఎస్పీలో 300 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల అప్‌గ్రేడ్.. ప్రభుత్వ ఉత్తర్వుల జారీ.
ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (ఏపీఎస్పీ) విభాగంలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుళ్లకు రాష్ట్ర...
By Pagadala Venkateswar 2026-03-28 06:07:27 0 185
Mizoram
Mizoram Advances Women's Empowerment Through New Initiatives
Mizoram continues to strengthen women's empowerment through initiatives focused on education,...
By Fathima Safa 2026-07-01 10:59:50 0 78
Andhra Pradesh
ప్రజల నుంచి వినతులు స్వీకరించిన కోడుమూరు ఎమ్మెల్యే
కర్నూలు : కోడుమూరు : గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించిన కోడుమూరు ఎమ్మెల్యే :  ప్రజల నుండి...
By Hari Krishna 2026-01-23 06:48:42 0 175
Andhra Pradesh
వందేభారత్ రైలుకు బొబ్బిలిలో హోల్ట్ కల్పించాలి: బేబినాయన
బొబ్బిలి రైల్వే స్టేషన్లో వందేభారత్ రైలుకు హోల్ట్ కల్పించాలని కేంద్ర విమానయాన శాఖామంత్రి కింజరాపు...
By Boiena Rajesh 2026-04-11 13:52:57 0 164
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com