దేవాదుల ప్రాజెక్టు భూసేకరణను వేగవంతంగా పూర్తి చేయాలి

0
297

కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్ పాయి

హనుమకొండ, జూలై 8:జే. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకానికి సంబంధించిన భూసేకరణ పురోగతిపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ బుధవారం న్యూఢిల్లీ నుంచి సంబంధిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పాల్గొని, భూసేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు.

హనుమకొండ కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్ పాయి, జిల్లాలో దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని తెలిపారు. ప్రస్తుతం మిగిలి ఉన్న సుమారు 42.34 ఎకరాల భూమి సేకరణకు వేగవంతమైన చర్యలు చేపట్టామని, సంబంధిత రైతులతో సమన్వయం చేస్తూ భూసేకరణను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.

ప్రాజెక్టు పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, సంబంధిత శాఖల మధ్య సమన్వయంతో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో హనుమకొండ నుంచి జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, పర్యవేక్షకులు జగత్ సింగ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది : ఎంపీ
కర్నూలు : కర్నూలు జిల్లా :  గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కర్నూలు ఎంపీ...
By Hari Krishna 2026-01-24 07:44:17 0 530
Andhra Pradesh
విజయవాడ క్యాంప్ కార్యాలయంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా వంగలపూడి అనిత గారి ఘన నివాళి
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు...
By Rajini Kumari 2026-01-18 14:21:08 0 325
Andhra Pradesh
హ్యాపీ బర్త్డే జగన్ అన్న
మూకుమ్మడిగా మీద పడితే తప్ప, ఒకొక్కడిగా వస్తే ముక్కలు, అయిపోతాం అనే భయం ఆ పార్టీలకి ఎప్పటికీ...
By Rajini Kumari 2025-12-21 12:27:47 0 251
Andhra Pradesh
పుంగనూరు: సుగాలి మిట్ట వద్ద ఢీకొన్న లారీలు
పుంగనూరు మండలం సుగాలి మిట్ట వద్ద శుక్రవారం రాత్రి రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. కంటైనర్ తో...
By Kothuru Murali 2026-06-06 14:19:06 0 89
Andhra Pradesh
మదనపల్లిలో అత్యాధునిక ‘క్రైమ్ పోలీస్ స్టేషన్’ప్రారంభించిన SP.
మదనపల్లిలోని బీటీ కళాశాల ప్రాంగణంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ బుధవారం నూతనంగా ఏర్పాటు చేసిన...
By Pagadala Venkateswar 2026-04-08 12:44:41 0 128
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com