దేవాదుల ప్రాజెక్టు భూసేకరణను వేగవంతంగా పూర్తి చేయాలి

0
82

కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్ పాయి

హనుమకొండ, జూలై 8:జే. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకానికి సంబంధించిన భూసేకరణ పురోగతిపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ బుధవారం న్యూఢిల్లీ నుంచి సంబంధిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పాల్గొని, భూసేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు.

హనుమకొండ కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్ పాయి, జిల్లాలో దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని తెలిపారు. ప్రస్తుతం మిగిలి ఉన్న సుమారు 42.34 ఎకరాల భూమి సేకరణకు వేగవంతమైన చర్యలు చేపట్టామని, సంబంధిత రైతులతో సమన్వయం చేస్తూ భూసేకరణను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.

ప్రాజెక్టు పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, సంబంధిత శాఖల మధ్య సమన్వయంతో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో హనుమకొండ నుంచి జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, పర్యవేక్షకులు జగత్ సింగ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
The Guardian of Peace: The Transformative Journey of Ake Ravi Krishna, IPS
Beyond the Badge: How One Officer Is Healing Society Through Empathy and Action In the corridors...
By Kalaga Sailaja 2026-07-13 11:40:10 0 55
Andhra Pradesh
మదనపల్లెలో ఘనంగా హనుమాన్ జయంతి, ప్రముఖుల హాజరు.
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె పట్టణంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం హనుమాన్ జయంతి...
By Pagadala Venkateswar 2026-05-13 05:35:57 0 77
Dadra &Nager Haveli, Daman &Diu
Tourism Infrastructure and Eco-Tourism Growth in 2026
Tourism infrastructure and eco-tourism initiatives gained momentum in 2026, supporting...
By Fathima Safa 2026-06-22 10:31:43 0 87
Telangana
Nizamabad
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన "Alive Arrive" రోడ్డు భద్రత అవగాహన...
By Sadaq Sadaq 2026-06-14 12:35:27 0 120
Andhra Pradesh
ఒకరోజు ముందే పింఛన్ల పంపిణీ డాక్టర్ జి లక్ష్మీశ
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబ‌ర్ 31, 2025*...
By Rajini Kumari 2025-12-31 11:03:09 0 237
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com